సీఎం షాకింగ్ నిర్ణయం.. వాళ్ల ఉద్యోగాలు ఊస్ట్?

praveen
ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అంటే నేరాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేది. అయితే ఎప్పుడూ మర్డర్లు మానభంగాలు అంటూ  రాష్ట్రంలో ఎక్కడ చూసినా అల్లకల్లోల పరిస్థితులు ఉండేవి. కానీ ఇక ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించి యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత పరిస్థితుల్లో మాత్రం పూర్తిగా మార్పులు వచ్చాయి.  సన్యాసి గా ఉన్నా వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయడం ఏంటి.. ఆయన అసలు పాలనకు అర్హుడేనా అని అప్పట్లో ఎన్నో విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పుడు యోగిని చూస్తూ ఉంటే మాత్రం ముఖ్యమంత్రి అంటే ఇలాగే ఉండాలి ఏమో అని అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.



 ముఖ్యంగా ఘోరమైన నేరచరిత్ర కు కేరాఫ్ అడ్రస్ అయిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని..  అసలు నేరాలే జరగని రాష్ట్రంగా తీర్చిదిద్దే విధంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రౌడీలు గ్యాంగ్ స్టార్స్ ని ఎన్కౌంటర్ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గ్యాంగ్ స్టర్ గా చలామణి అవుతూ ప్రజలను హింసిస్తూ ఎంతో మంది వ్యాపారులు ఉద్యోగులపై ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న వారిని ఎన్కౌంటర్ చేయడంపై ప్రతిపక్షాలు ఎన్నో విమర్శలు చేశాయి. కానీ అటు యోగి ఆదిత్యనాథ్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.




 సాధారణంగా గ్యాంగ్ స్టర్స్ రెచ్చిపోతున్నారు అంటే వాళ్లకు సంబంధించి పోలీసు విభాగంలో అటు ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఎంతో మంది ఉద్యోగులు కూడా పని చేస్తూ ఉంటారు.  వాళ్ల తోడ్పాటు కారణంగానే ఎన్నో అరాచకాలు చేస్తూ ఉంటారు గ్యాంగ్ స్టార్స్. ఇక ఇటీవల ప్రభుత్వం ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగులపై కూడా దృష్టి సారించింది. గ్యాంగ్ స్టార్స్ తో కలిసి ప్రయాణం చేసినటువంటి 222 మంది పోలీసులను గుర్తించింది. ఇటీవల ప్రభుత్వం వారిని పూర్తిగా తీసేసింది.  అంతేకాదు గ్యాంగ్ స్టర్స్ రౌడీలు స్వాధీనం చేసుకున్నటువంటి భూములకు పత్రాలు జారీ చేసినట్టు వంటి 500 మంది అధికారులను కూడా ఉద్యోగాల నుంచి తొలగించింది యోగి ప్రభుత్వం మరో సంచలనం సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: