కొడాలి నాని ఎందుకు సైలెంట్ అయ్యారు.. ఏం జరిగింది ?
అప్పటినుంచే నాని వ్యవహారశైలి ఏదో తేడా కొడుతుంది అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఇక ఏపీ అప్పుల విషయంలో ప్రతిపక్షాలు ఇంత రాద్ధాంతం చేస్తున్న కూడా కొడాలి నాని బయటకు రావడం లేదు. టిడిపి - చంద్రబాబు - లోకేష్ ను కడిగి పడడంలో కొడాలి నాని తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. సరే మిగిలిన మంత్రులు ఎప్పుడూ మాట్లాడరు. అసలు చాలా మంది మంత్రులో కాదో ? కూడా తెలియదు. కానీ ఎప్పుడూ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ విపక్షాలను ఏకడంలో ముందుండే నానికి ఏమైందన్నది మాత్రం అంతు పట్టడం లేదు.
ఇక జలవివాదం విషయంలోనూ నాని తన స్థాయికి తగిన విమర్శలు, కౌంటర్లు ఇవ్వడం లేదన్న టాక్ అయితే ఉంది. ఇక ఇప్పుడు సజ్జల ఒక్కరే కాస్తో కూస్తో విపక్షాల విమర్శలను తిప్పికొడుతున్నారు. సజ్జలో, బొత్సో మాట్లాడితే అది చాలా లైట్గా ఉంటుంది. కొడాలి మాస్ పంచ్ పడితేనే ఆ కిక్ వేరుగా ఉంటుంది. త్వరలో మంత్రి వర్గ ప్రక్షాళన నేపథ్యంలో నానిని తప్పించి అదే కులానికి చెందిన మర్రి రాజశేఖర్కు మంత్రి పదవి ఇస్తారన్న ఓ టాక్ ఉంది. ఈ నేపథ్యంలోనే నాని సైలెంట్ అయ్యారా ? అన్నది ఓ సందేహంగా ఉంది.