రేవంత్ రెడ్డి రిస్క్ చేస్తున్నాడా ?
హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రజలకు నాపైనే అభిమానముందని తప్పకుండా వారు నన్నే గెలిపించుకుంటారని దైర్యంగా ఉన్నారు. ఇప్పటి వరకు హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు అందిన ప్రతి ఫలంలో నా పాత్ర ఉందని ఘంటాపధంగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయిన రేవంత్ రెడ్డి ఈ ఎన్నికలో ఏమి పాలుపోని స్థితిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎలాగు ఈ ఎన్నికలో గెల్వలేదని సొంత పార్టీ నాయకుడే బహిరంగంగా చెప్పిన సంగతి తెలిసిందే. అయితే తన మద్దతును బీజేపీ లోని ఈటల రాజేందర్ కు మద్దతిస్తారని అంతా అనుకుంటున్నారు.
అయితే ఆదిలోనే ఇలాంటి నిర్ణయం తీసుకుంటే అధిష్టానం దగ్గర తన పరువుపోయే అవకాశం లేకపోలేదు. వాస్తవంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి అంత ఈజీగా మద్దతిచ్చే రకం కాదు. చివరి వరకు గెలుపే లక్ష్యంగా పోరాడే వ్యక్తిత్వం కల వాడు. కాబట్టి అందరూ అనుకున్నట్లే రేవంత్ రెడ్డి ఈటలకు మద్దతు ఇచ్చి తెరాసను దెబ్బ తీస్తాడా లేదా వారిద్దరికీ పోటీగా తన బలమేమిటో నిరూపించుకుంటాడా అన్నది తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.