ఒక్క నిర్ణయంతో గాంధీ ఫ్యామిలీని ఫిదా చేసిన సిఎం...?

VAMSI
రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని గద్దె దించడానికి బీజేపీయేతర పార్టీలు సమిష్టిగా పోరాడుతున్నాయి. ఇందులో భాగంగానే దేశ వ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక రాష్ట్రాలకు చెందిన ముఖ్యనాయకులకు మూడు రోజుల క్రితమే కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో అనేక ప్రాంలయికల గురించి సుదీర్ఘంగా చర్చించినట్లుగా తెలిసింది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలను బలోపేతం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులను కదుపుతోంది. ఇందుకు అన్ని పార్టీలు సంసిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే ఈ నెల 20 వ తేదీ సోనియా గాంధీ నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనబోతున్నట్లు మహారాష్ట్ర శివసేన నాయకుడు సంజయ్ రౌత్ మీడియా ముఖంగా తెలియచేశారు.

అయితే ఈ సమావేశం గురించిన ఖచ్చితమైన సమాచారం కాంగ్రెస్ పార్టీ నుండి కానీ ఇతర పార్టీల నుండి కానీ రాకపోవడం గమనార్హం. దేశంలో అన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలలోని ప్రతి పక్ష పార్టీలు అన్నీ కూడా తమ బలాన్ని పెంచుకుంటున్నాయని ఈ సందర్భంగా సంజయ్ రౌత్ పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాయని రౌత్ తెలిపారు. అందరూ ఒక్కటిగా ఉండి మోదీ నాయకత్వానికి చరమగీతం పాడుతామని తెలిపారు. కాగా ఈ సమావేశం గురించిన అధికారిక సమావేశం త్వరలో వస్తుందా లేదా  అన్నది తెలియాల్సి ఉంది. ఇలా ఒక్క ప్రకటనతో గాంధీని ఫిదా చేశారు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే.

అయితే వీరనుకుంటున్నట్లు బీజేపీని ఓడించడం అంతా సులభమయిన పని కాదని తెలుస్తోంది. ఇందుకు తగినట్లుగా బీజేపీ కూడా ప్రణాళికలకు పదును పెడుతోంది. అయితే ఈ సారి కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరిన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఏమైనా చేయగల సమర్ధుడు. గెలవడానికి చేయవలసిన పనులు, పన్నాల్సిన వ్యూహాలు తన అమ్ముల పొదిలో బోలెడున్నాయి. కాబట్టి ఈ సారి ఎన్నికల వ్యూహ ప్రతివ్యూహాలు ఒక రేంజ్ లో ఉంటాయని తెలుస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: