ఇక కో-ఎడ్యుకేషన్ బంద్.. షాకింగ్ నిర్ణయం?

praveen
ఆఫ్ఘనిస్తాన్లో ఆధిపత్యాన్ని చేపట్టిన తాలిబన్లు ఇటీవలే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి సహా వివిధ శాఖలకు మంత్రులను  నియమించారు.  ఈ క్రమంలోనే ఇక  ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తాలిబన్లు ఎలా వ్యవహరించ పోతున్నారు ఎలాంటి విధివిధానాలు తీసుకురాబోతున్నారు అన్నది ప్రస్తుతం అంతర్జాతీయ సమాజంలో ఎంతో హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే మొన్నటి వరకు మహిళలను గౌరవిస్తానని అందరికీ సముచిత స్థానం కల్పిస్తామని చెప్పిన తాలిబన్ల తీరులో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు అన్నది తెలుస్తుంది.  ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న మహిళలు అందరినీ ఇంటిపట్టునే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.



 మహిళలకు సంబంధించిన క్రీడల విషయంలో కూడా అటు తాలిబన్లు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారూ. ఇక ఇటీవల మహిళల చదువు విషయంలో తాలిబన్ల ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కూడా అంతర్జాతీయ సమాజంలో హాట్ టాపిక్ గా మారిపోయాయ్ అని చెప్పాలి. అయితే మొన్నటి వరకు మహిళలు పురుషులతో కలిసి కో-ఎడ్యుకేషన్ ద్వారా చదువుకున్నారు.  కానీ ఇప్పుడు మాత్రం ఎడ్యుకేషన్ వ్యవస్థలో పూర్తిగా మార్పులు తెచ్చి తాలిబన్లు తమ విధి విధానాలను అమలు లోకి తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.



 ఇప్పటికే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్కొక్కటిగా తాలిబన్లు తమ విధానాలను ప్రకటిస్తూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నారూ. కో ఎడ్యుకేషన్ పూర్తిగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న వారంతా ముస్లింలే.. వారు ఈ కో-ఎడ్యుకేషన్ రద్దు నిర్ణయాన్ని అంగీకరిస్తారు అంటూ తాలిబన్ల ప్రభుత్వం లో ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్న అబ్దుల్ బాకీ వ్యాఖ్యానించారు. చదువుకునే అమ్మాయిలు ప్రత్యేక డ్రెస్ కోడ్ పాటించాలి అంటూ చెప్పుకొచ్చారు. పురుషులతో సమానంగా  చదువుకోవడానికి మహిళలకు యూనివర్సిటీలలో ప్రవేశం లేదు అంటూ విద్యాశాఖ మంత్రి అబ్దుల్ బాకీ చెప్పిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారి పోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: