నమో భారత్ : హోదాను మరిచిన పెద్ద మనిషి !
రాష్ట్రంలో ఉన్న పెద్దలంతా కేంద్రానికి అనుబంధంగా రాజకీయం చేస్తుండడంతో మోడీ ఎదురన్నది లేకుండా పోతోంది. హోదాతో పాటు జోన్ కూడా రాలేదు. ఏమీ ఇవ్వడం లేదు. పరిశ్రమల రాకకు చేయూత ఇవ్వ లేదు. ఇంకా వర్శిటీల ఏర్పాటుకు సాయం ఇవ్వలేదు. ఏం చేయకపోయినా కూడా జగన్ ఆయనను నిలదీయడం లేదు. విజయ్ సాయి రెడ్డి అప్పుడప్పుడూ మీడియా ముందుకు వచ్చి ఏవో నాలుగు మాటలు చెప్పి, తెరవెనుక బీజేపీ స్నేహంలో మునిగి తేలుతున్నారు అన్నది ఓ విమర్శ.
ఆధునిక దేవాలయం పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని జగన్ సాధించలేకపోయారు. మోడీ ఇవ్వడం అన్నది ఇక జరగని పని. రాష్ట్రం విడిపోయాక అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కూడా హోదా పై పోరు సాగించలేకపోయింది. హోదాను ఇవ్వమని, ఇంకొన్ని రాష్ట్రాలు కూడా ఇదే తరహాలో అడుగుతున్నాయని చెప్పి ప్యాకేజీకి ఒప్పించారు. ప్యాకేజీ పేరిట విడుదలయిన నిధులు కూడా రాష్ట్రాభివృద్ధికి సహాయ పడలేదు. అవేవీ ఉపయోగపడలేదు. రాజధాని నిర్మాణంకు సంబంధించి కొన్ని నిధులు వెచ్చించినా వాటి అమలు తీరు అన్నది ఇప్పటికీ ఎన్నో సందేహాలకు తావిస్తునే ఉంది.