జగనోరి ముందడుగు: ముందస్తు గాలిలో కమ్యూనిస్టుల హవా ఎంత?
కానీ, సీపీఎం , సీపీఐలు రెండూ కూడా చతికిల పడ్డాయి. 2019 ఎన్నికలకు వచ్చే సరికి .. ముందస్తుగానే జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసినా.. ఎక్కడా ఒక్క స్థానంలోనూ గౌరవ ప్రదమైన ఓటు బ్యాంకును సొంతం చేసుకోలేక పోయారు. ఇక, జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకోవడం తో.. బయటకు వచ్చిన సీపీఐ.. సీపీఎంలు.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. సీపీఐ పరోక్షంగా.. ప్రత్యక్షంగా టీడీపీకిమద్దతుగా వ్యవహరిస్తోంది. ఇక, సీపీఎం.. పరోక్షంగా అధికార పార్టీ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందనే వాదన బలంగా ఉంది.
ఈ నేపథ్యంలో ఎవరు ఎటు వైపు మొగ్గు చూపుతారు? అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తున్న విషయం. వైసీపీని చూసుకుంటే.. సీపీఎం పట్ల సానుభూతి ఉన్నప్పటికీ.. పిలిచి పిల్లనిచ్చే పరిస్థితి లేదు. అంటే.. వచ్చే ఎన్నికల్లో సీపీఎంతో పొత్తు పెట్టుకుని.. టికెట్లు ఇచ్చే అవకాశం ఎట్టిపరిస్థితిలోనూ లేదు. ఇక, టీడీపీ వైపు మొగ్గుతారా? అంటే.. అది కూడా కనిపించడం లేదు. ఇక, సీపీఐ విషయానికి వస్తే.. టీడీపీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది. అయితే.. రెండుకు మించిన స్థానాలు టీడీపీ కూడా ఇచ్చే పరిస్థితి లేదు.
సో.. దీనిని బట్టి.. సీపీఐ పరిస్థితి ఒకింత ఆశాజనంగా ఉన్నప్పటికీ.. సీపీఎం పరిస్థితి మాత్రం ఎటూ కాకుండా పోయే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరోవైపు.. జనసేనతో పొత్తు పెట్టుకుందామని అనుకున్నా.. ఆ పార్టీ బీజేపీతో ఉన్నంత వరకు సీపీఎం అటు చూసే పరిస్థితి లేదు. దీంతో ఒంటరి పోరు తప్పే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం చేస్తారో చూడాలి.