సాక్షి మీడియాకు నేను కో ఓనర్ అంటూ షర్మిల ఓ మీడియా ఇంటర్య్వూలో స్పష్టం చేశారు. త్వరలో మీరు తెలంగాణలో సాక్షి మీడియాను టేకప్ చేయబోతున్నారా అంటూ యాంకర్ ప్రశ్నించడంతో షర్మిల ఇలా సమాధానం ఇచ్చారు. తాను సాక్షి మీడియాకు కో ఓనర్ అని ప్రస్తుతం కూడా ఉన్నానని చెప్పారు. అయితే ఇటీవల ఓ సాక్షి మీడియా ప్రతినిధిపై షర్మిల సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. సాక్షి మీడియా మాగురించి కవర్ చేయదు అని అన్నారు. కానీ ఇప్పుడు మాత్రం షర్మిల సాక్షి మీడియాకు కో ఓనర్ అని చెప్పడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక పాదయాత్రలతో మీకు ఏమైనా సెంటిమెంట్ ఉందా.?? పాదయాత్ర చేసిన తరవాత వైఎస్ ఆర్ సీఎం అయ్యారు.
జగన్ సీఎం అయ్యారు అందుకే మీరు కూడా సెంటిమెంట్ తో మీరు కూడా పాదయాత్ర చేస్తున్నారా అని ప్రశ్నించగా...పాదయాత్ర చేస్తే సీఎం అవ్వరని ప్రజలు ఆశీర్వదిస్తేనే సీఎం అవుతారని వ్యాఖ్యానించారు. ప్రజల కోసం పోరాటాలు చేస్తే వారి పక్షాణ నిలబడితే అప్పుడు వారు ఆశీర్వదిస్తేనే సీఎం అవుతారని షర్మిల అన్నారు. ఇక ఏపీలో వైసీపీకి విజయమ్మ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారని కానీ తెలంగాణలో మీరు చేస్తున్న పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని.. ప్రతి యాక్టివిటీకి విజయమ్మ సపోర్ట్ చేస్తున్నారు. దానిని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించగా షర్మిల ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
ఎందుకు సపోర్ట్ చేయకూడదు నాకు తల్లి..వైఎస్ఆర్ కు భార్య నన్ను సోపర్ట్ ఎందుకు చేయకూడదని అన్నారు. త్వరలో మీ పార్టీకి ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా వ్యవహరించబోతున్నారు..ఆయనతో చర్చలు జరుపుతున్నారంటూ ప్రచారం జరుగుతుంది అది నిజమేనా అని ప్రశ్నించగా..ప్రశాంత్ కిషోర్ భాయ్ మాకు సన్నిహితులు అన్నలాంటి వారు. ఆయన నాకు మాటిచ్చారు సపోర్ట్ చేస్తానని అంటూ షర్మిల చెప్పారు. ఇప్పటి నుండి తమ పార్టీ కార్యక్రమాల్లో ప్రశాంత్ కిషోర్ ఉంటారని షర్మిల స్పష్టం చేశారు.