సైకిల్ పార్టీతో గ్లాస్ జోడీ ఖాయమేనా..?
ఆ తర్వాత అనూహ్యంగా ఈ మూడు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. ముందు జనసేన పార్టీ విడిపోగా... ఆ తర్వాత బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకుంది. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. కానీ అనూహ్యంగా పరిషత్ ఎన్నికల ఫలితాల తర్వాత... రాష్ట్రంలో కొత్త పొత్తులు తెరపైకి వచ్చింది. చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నేతలు లోపాయి కారి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎంపీపీ స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కకుండా... జనసేన, టీడీపీ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరించి సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఇదే అంశం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్గా మారింది. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నాయనే వార్తలు ట్రోల్ అవుతున్నాయి. కొంత మంది మరో అడుగు ముందుకు వేసి... జనసేనా పార్టీకి 25 ఎమ్మెల్యేలు, 5 ఎంపీ స్థానాలు ఇచ్చేందుకు కూడా టీడీపీ అంగీకరించినట్లు చెబుతున్నారు. చూడాలి... రాబోయే ఎన్నికల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో మరి.