ఆ ఇద్దరు మంత్రులకు దిమ్మతిరిగే షాక్ ఇస్తోన్న జగన్...!
అంటే ఈ సారి మంత్రులందరూ ఔట్ అవ్వడం ఖాయమని తేలిపోయింది. ఇక వారి ప్లేస్లో కొత్త మంత్రులు రావడం కూడా పక్కా అని అర్ధమవుతుంది. కాకపోతే అందర్నీ పక్కనబెట్టేస్తారని చెబుతున్నారు బాగానే ఉంది గానీ, గతేడాదే మంత్రివర్గంలోకి వచ్చిన ఇద్దరు కొత్త మంత్రులు కూడా సైడ్ అవ్వాల్సిన పరిస్తితి ఉందా? లేదా? అనేది క్లారిటీ రావడం లేదు.
ఎందుకంటే మండలి రద్దు నేపథ్యంలో పిల్లి సుభాష్, మోపిదేవి వెంకటరమణలు ఎమ్మెల్సీ, మంత్రి పదవులకు రాజీనామా చేశారు. జగన్ వారికి రాజ్యసభ పదవులు ఇచ్చారు. ఇక వారి స్థానంలో సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాల్లని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. గతేడాది జులైలో ఈ ఇద్దరు జగన్ మంత్రివర్గంలోకి వచ్చారు. అంటే వీరి క్యాబినెట్లోకి వచ్చి ఏడాది దాటింది.
అయితే ఈ ఏడాది చివరన గానీ, వచ్చే ఏడాది మొదట్లోగానీ జగన్ మంత్రివర్గంలో మార్పులు చేసే అవకాశం ఉంది. అంటే కరెక్ట్గా వీరు ఏడాదిన్నర మంత్రులుగా పనిచేసినట్లు అవుతుంది. అయితే మిగిలిన వారు రెండేళ్లన్నర పనిచేసినట్లు అవుతుంది. అలాంటప్పుడు జగన్ వీరిని అప్పుడే తప్పించేస్తారా? లేక కంటిన్యూ చేస్తారా? అనే విషయంపై క్లారిటీ రావడం లేదు. కానీ బాలినేని చెప్పినట్లుగా చూసుకుంటే ఈ ఇద్దరు మంత్రులు కూడా దుకాణం సర్దేసుకోవచ్చని తెలుస్తోంది.