జి20 : ఆఫ్ఘన్ కు.. ఆపన్నహస్తం అవసరం..!
ఈ నేపథ్యంలోనే తాజాగా జి20 దేశాలు విర్చువల్ గా కేవలం ఆఫ్ఘన్ ప్రజల కోసమే సమావేశం అవడం ప్రపంచదేశాలలో మార్పు మొదలైందని తెలియజేస్తుంది. ఈ సమావేశంలో భారత ప్రధాని కూడా ప్రసంగించారు. ప్రపంచం ఆఫ్ఘన్ కోసం అండగా ఉండాలని ఆయన ఉద్ఘాటించారు. ఆఫ్ఘన్ లో ప్రజలను అందరు కలిసి ఆదుకోవాల్సిన అత్యవసరం పడిందని ఆయన అన్నారు. ఈ విషయంపై త్వరగా ప్రపంచ దేశాలు ఒక నిర్ణయానికి వస్తేనే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. తాలిబన్ సహా ఏ తీవ్రవాద సంస్థకో ఆఫ్ఘన్ భూభాగమే కాదు, ఏ భూభాగమైన ఇచ్చి చూస్తూ కూర్చోవడం ప్రపంచ దేశాలు చేయరాదని ఆయన అన్నారు.
ఇప్పటికే ఐరాస ఆఫ్ఘన్ పై విచారణ జరపాలని తీర్మానించుకుంది. దీని కోసం ఈ సమావేశంలో కూడా ఆయా దేశాల అభిప్రాయాలు తెలుసుకుంది. అందరు కలిసి ఆఫ్ఘన్ కు పూర్వస్థితి తెలగలిగితే సంతోష దాయకమని వారు అభిప్రాయం వ్యక్తం చేసినట్టే తెలుస్తుంది. మరోవైపు తాలిబన్ లు కూడా తమ ప్రభుత్వాన్ని అస్థిర పరిచే ఏ కార్యక్రమం ఎవరు చేపట్టిన ఎవరిని విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. తాజాగా అమెరికా ప్రతినిధులతో చర్చలతో తాలిబన్ లు పాల్గొన్నప్పటి మాట అది. దీనితో ఐరాస నుండి ఆయా దేశాలు తమ సాయాన్ని ఆఫ్ఘన్ ప్రజలకు చేయాలని ముందుకు వస్తున్నాయి. దీనితో బహుశా తాలిబన్ ల పీడ ప్రపంచానికి వదిలిపోవచ్చేమో అంటున్నారు నిపుణులు.