చైనా రెచ్చగొట్టే చర్యలు.. గమనిస్తున్న భారత్..!
మొన్నమొన్నటిదాగా ఇదే తరహాలో తైవాన్ పై ఉరకలు వేసిన చైనా ఇప్పుడు వ్యూహం మార్చి భారత్ సరిహద్దులలో చక్కర్లు కొడుతూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది. గతంలో ఇలా చేయడానికి కారణం తైవాన్ పై వ్యూహాత్మక దాడి చేయడానికే అనేది తెలిసిన విషయమే అయినప్పటికీ, ఇది మాత్రం భారత్ ను రెచ్చగొట్టే చర్య అనే నిపుణులు అంటున్నారు. తన దేశంలో పరిస్థితులు అనుకూలంగా చేసుకునేందుకు ఇలాంటి తలకాయలేని పనులు చేస్తుంది చైనా. ఇప్పటికే పీకల లోతులో అక్కడ ప్రజలకు ప్రభుత్వం పై వ్యతిరేకత ఉన్నదని, దానిని యుద్ధం పేరుతో దేశభక్తిగా మార్చవచ్చనే నీతిలేని ఆలోచన చేయడం ఒక్క చైనాకే సాధ్యం.
ఇలా ఎన్ని పన్నాగాలు పన్నినప్పటికీ భారత్ సంయమనం పాటిస్తూ తన పని తాను చూసుకుంటుంది. తాజాగా సరిహద్దులలో ఉన్న వారికే విశేష అధికారాలు ఇవ్వడం ద్వారా కేంద్రం కూడా ప్రతి విషయంలో జోక్యం చేసుకొనే అవకాస్లు తగ్గినట్టే. స్వతంత్రంగా సరిహద్దులలో ఉన్న అధికారులే నిర్ణయాలు తీసుకునే అధికారాలు ఇవ్వడంతో కేంద్రం పై కూడా కాస్త ఒత్తిడి తగ్గినట్టే చెప్పవచ్చు. చైనా ఎన్ని కుయుక్తులు పన్నినప్పటికీ భారతసైన్యం కూడా సందర్బోచిత నిర్ణయాలతోనే అడుగు ముందుకు వేస్తున్నారు. ఇప్పుడు భారత్ వైపు నుండి ఏ చిన్న స్పందన వచ్చినప్పటికీ చైనా దానిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు సిద్ధంగా ఉంది.