బ్రేకింగ్: వైసీపీ కీలక నేత మృతి
అంబటి అనీల్ సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర మేనల్లుడు అవుతారు. పీడికల రాజన్న దొర పార్టీ సీనియర్ నేత. ఆయన ఇప్పటికే వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యే గా విజయం సాధించారు. త్వరలో జరిగే మంత్రి వర్గ ప్రక్షాళన లో సైతం ఆయన మంత్రి అవుతారు అన్న అంచనాలు ఉన్నాయి. మేనళ్లుడి ని జడ్పీ వైస్ చైర్మన్ చేసేందుకు రాజన్న దొర సైతం చక్రం తిప్పారు. అనిల్కు పదవి వచ్చిందన్న ఆనందం ఎంతో కాలం లేకుండా పోయింది.
అనీల్ సొంతూరు సాలూరు మండలం సన్యాసిరాజుపేట. జడ్పి వైస్ చైర్మన్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు విషాదం లో మునిగి పోయారు. అనిల్ మృతి పట్ల వైసీపీ కి చెందిన జిల్లా ప్రజా ప్రతినిధులు అందరూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం ఈ విషయం తెలుసుకుని దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు అనీల్ కుటుంబానికి తన ప్రగాడ సానుభూతి తెలిపారు. ఇక పార్టీ ఉత్తరాంధ్ర వ్యవహారాల ఇన్ చార్జ్ ఎంపీ విజయ సాయి రెడ్డి కూడా అనీల్ మృతి పట్ల సంతాపం తెలిపారు.