ఈ రోజు నుండి తెలంగాణ రాష్ట్ర ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరుగనున్నాయి. ఇవాళ ప్రారంభం కానున్న తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు వచ్చే నెల అంటే.. నవంబర్ 3 వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఇక ఇవాళ్టి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యం లో షెడ్యూల్ కూడా విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు. ఇవాళ నుంచి ప్రతి రోజూ ఉదయం 9 నుండి 12 గంటల వరకు పరీక్ష లు జరుగనున్నాయి. పరీక్ష ప్రారంభం అయ్యాక ఒక్క నిమిషం లేట్ అయిన నో ఎంట్రీ అంటూ కొత్త నిబంధనలు పెట్టింది తెలంగాణ ఇంటర్ బోర్డు. హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా రెండు పరిక్షలను రి షెడ్యూల్ చేసిన సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగానే.... ఆదివారం రోజు కూడా పరీక్ష జరునుందన్న మాట. 70 శాతం సిలబస్ నుండి ప్రశ్నలు... ప్రశ్నల్లో 50 శాతం పైగా ఛాయిస్... ఉండనున్నట్లు ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. 4 లక్షల 59 వేలు 237 మంది విద్యార్థులు పరీక్ష రాయ బోతున్నారని... దీని కోసం 17 వందల 68 పరీక్ష సెంటర్ లు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేసింది తెలంగాణ ఇంటర్ బోర్డు. ఇంటర్ పరీక్షల నిర్వహణ కు వాక్సిన్ తీసుకున్న వారి నే నియామకం చేసినట్లు స్పష్టం చేసింది తెలంగాణ ఇంటర్ బోర్డు.
25 వేల మంది ఇన్విజిలేటర్స్ నియామకం చేశామని... విద్యార్థులు ఒత్తిడికి, భయానికి లోను అయితే సంప్రదించడానికి మానసిక నిపుణుల ఏర్పాటు చేసినట్లు ప్రకటన చేసింది ఇంటర్ బోర్డు. విద్యార్థులు తెచ్చుకునే వాటర్ బాటిల్స్ కి అనుమతి... మాస్క్ ధరించి రావాలని స్పష్పం చేసింది బోర్డు. థర్మల్ స్క్రీనింగ్ ఉంటుంది.... ఎవరికైనా జ్వరం లక్షణాలు ఉంటే ప్రత్యేక రూమ్ లో పరీక్ష ఉంటుందని వెల్లడించింది. విద్యార్థులు ఆన్లైన్ ద్వారా డౌన్ లోడ్ చేసుకున్న హాల్ టికెట్స్ సరిపోతుంది.. ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదని తెలిపింది.