కరోనా వైరస్ గత రెండేళ్లుగా మన కంటిపై కునుకు లేకుండా చేస్తున్న ఒక చీడ పురుగు. ఈ మధ్య భారత్ లో దీని వ్యాప్తి తగ్గిందని అందరూ ప్రశాంతంగా తమ జీవితాలను యధావిధగా కొనసాగిస్తున్న తరుణంలో మళ్ళీ తెలుగు ప్రజలను కలవరపెడుతోంది ఈ మహమ్మారి. కొత్త రకం వేరియంట్ తో కోవిడ్ మళ్లీ తన కోరలు చాస్తోంది. బ్రిటన్, రుమేనియా, రష్యా తదితర దేశాలలో పాటు మళ్ళీ మన దేశాన్ని కూడా టార్గెట్ చేసింది ఈ మాయదారి వైరస్. రష్యాలో కేవలం 24 గంటల్లో 1100 మందికి పైగానే కరోనాతో మరణించడం కలవర పెడుతోంది. ఇటు భారత్ లోనూ కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో కరోనా ఉదృతి రోజు రోజుకు పెరుగుతుండటం అందరినీ భయపెడుతోంది.
కేంద్రం కూడా తెలుగు రాష్ట్రాలను , మిగిలిన రాష్ట్రాలను కోవిడ్ విషయమై తరచూ హెచ్చరిస్తోంది. ఇప్పటికే దేశంలో కొన్ని రాష్ట్రాల్లో కరోనా మరో కొత్త వేరియంట్ తో దూకుడు ప్రదర్శిస్తోంది, ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు కూడా అప్రమత్తం అవ్వాలని లేదంటే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది హెచ్చరికలు జారీ చేస్తోంది. రానున్న కాలంలో కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని..ఇప్పటి నుండే జాగ్రత్తలు వహిస్తే ఆ ప్రభావాన్ని కాస్త తగ్గించ వచ్చని సూచిస్తోంది.
ఇప్పటికే కోవిడ్-19 వైరస్ కొత్త రకం ఏవై 4.2 కేసులు భారత్లోనూ వెలుగు చూశాయి. కర్ణాటక రాష్ట్రం ఈ తరహా కేసులను గుర్తించినట్లు అధికారికంగా ప్రకటించింది. మరి ఈ రాబోయే రోజుల్లో కరోనా ఉధృతిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు తప్పని సరిగా పాటించడం ఎంతైనా అవసరం. అయితే త్వరలోనే లాక్ డౌన్ విధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి ప్రభుత్వం కన్నా ముందు గానే ప్రజలు సరైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం ఉత్తమం.