దారుణం : ఒడిస్సా అమ్మాయిలని అమ్మేస్తున్నారు?

praveen
మనం ఎక్కువగా సినిమాల్లో చూస్తూ ఉంటాం..  ఒక ప్రాంతంలో ఉన్న అమ్మాయిలను మాయ మాటలతో నమ్మించి ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి అక్కడ వారితో పాడు పనులు చేయించడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే నిజజీవితంలో కూడా అక్కడక్కడ ఇలాంటి తరహా ఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఇక ప్రస్తుతం ఒడిషాలో ఇలాంటి తరహా ఘటనలు జరుగుతున్నాయి అన్న విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. అక్కడ పేదలను టార్గెట్ గా చేసుకుంటున్న ఎంతోమంది కేటుగాళ్లు ఇక అమ్మాయిల రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒడిశాకు చెందిన ఎంతో మంది అమ్మాయిలను ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి అమ్మేస్తున్నారన్నది ఇటీవలే బయటపడింది. పేద గిరిజనులు కనీసం అమ్మాయిల పెళ్లిళ్లు చేయలేని స్థితిలో ఉన్నారు.



 ఇక ఇలాంటివారిని అటు కేటుగాళ్లు టార్గెట్ చేసుకుంటున్నారట. పేదరికం లో ఉన్నటువంటి కుటుంబాలకు మీ బిడ్డలకు పెళ్లి చేస్తామంటూ నమ్మిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏకంగా లక్ష నుంచి 5 లక్షల వరకు ఎదురు కట్నం కూడా ఇస్తున్నారు  ఇక ఆ తర్వాత ఒడిషాకు చెందిన యువతులను రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు తీసుకెళ్లి అక్కడ యువకులకు పెళ్లి చేసుకునేందుకు అమ్మేస్తున్నారు. ఇటీవలి కాలంలో రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో యువకులు పెళ్లి చేసుకోవడానికి కనీసం అమ్మాయిలు దొరకని పరిస్థితి నెలకొంది. ఒకవేళ దొరికినా భారీగా సంపాదించడం బాగా సెటిల్ అయిన వారిని మాత్రమే అక్కడి అమ్మాయిలు కావాలి అనుకుంటున్నారట.



 ఈ క్రమంలోనే ఢిల్లీ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ లలో  అమ్మాయి దొరకకపోవడంతో ఇలా ఎంతోమంది బ్రోకర్ ముఠాలు ఒడిషా నుంచి నిరుపేద కుటుంబాలను టార్గెట్ చేసుకుని అమ్మాయిలకు తీసుకెళ్లి ఇక ఇతర రాష్ట్రాలలో యువకులు పెళ్లి చేసుకోవడానికి ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకుని అమ్మేస్తున్నారు అన్న విషయం ఇటీవల బయటపడింది. ఇక ఇటీవల ఏకంగా పోలీసు అధికారులు కూడా ఈ విషయాన్ని గుర్తించి కేసులు నమోదు చేయడం మొదలుపెట్టారు. ఇక బ్రోకర్ల బండారం బయటపెట్టడంతో ఇది కాస్త హాట్ టాపిక్గా  మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: