కేసీఆర్ Vs ఈటెల: ఎవరు గెలిచి ఎవరు ఓడినా మునిగిపోయేది ఆ పార్టీయే...?
అయితే ఇప్పుడు హుజూరా బాద్ ఫలితం ఎలా ఉన్నా తమ భవిష్యత్తు ఏంటన్న బెంగ అయితే కాంగ్రెస్ నేతల్లో ఉంది. రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా వచ్చాక ఆ పార్టీకి చాలా చోట్ల కొత్త జోష్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోయినా లేదా మూడో స్థానంలో ఉన్నా అంతకన్నా దిగజారి డిపాజిట్లు కూడా కోల్పోయినా తెలంగాణ లో ఆ పార్టీ మరింత మునిగి పోవడం ఖాయమే అని చెప్పాలి. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ నేతలకు పట్టుకున్న భయం.
మరోవైపు బీజేపీ ఇప్పటికే దుబ్బాక లో గెలిచింది. అక్కడ కాంగ్రెస్ మూడో స్థానంతో ఘోర అవమానం మిగుల్చుకుంది. ఇక జీవీఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు కేవలం రెండు డివిజన్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు హుజూరా బాద్లో కనుక బీజేపీ గెలిస్తే తెలంగాణ లో అధికార టీఆర్ ఎస్కు తామే ప్రత్యామ్నాయం అన్న సంకేతాలు బలంగా ప్రజల్లోకి తీసుకు వెళుతుంది. అప్పుడు అంతిమంగా కాంగ్రెస్ మరింత పతనం అయిపోవడం ఖాయం.