ఎంతో ఆసక్తి రెండు తెలుగు రాష్ట్రాల్లో ని ప్రజలు.... చూస్తున్న హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నిక కౌంట్ డౌన్ మరి కాసేపట్లోనే పడనుంది. ఈ రోజే హుజూరాబాద్ ఉప ఎన్నిక పలితాలు వెలువడనున్నాయి. హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నిక అక్టోబర్ 30 న జరిగగా... ఇవాళ ఈ ఉప ఎన్నిక ఫలితాలు వెలువ డనునన్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని... ప్రజలు చాలా ఉత్కంఠ భరితంగా ఎదురు చూస్తున్నారు. హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కరీంనగర్ లో నగరం లో జరుగనుంది.
ఈ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో 2 లక్షల 5 వేల 236 ఓట్లు పోల్ కాగా... అలాగే 86. 64 శాతం పోలింగ్ జరిగినట్లు స్పష్టం చేసింది ఎన్నికల సంఘం అధికారులు. 753 పోస్టల్ బ్యాలెట్స్ ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘం అధికారులు.. మొదటి పోస్టల్ బ్యాలెట్స్ లెక్కించనున్నారు ఎన్నికల అధికారులు. ఆ తర్వాత evm ఓట్ల లెక్కింపు జరుగనుంది. దీంతో మొత్తం 22 రౌండ్స్.. 14 టేబుల్స్ ఏర్పాటు చేసారు ఎన్నికల అధికారులు. అలాగే... రెండు హాల్స్ లో కౌంటింగ్ .. ఒక్కో హాల్ లో 7 టేబుల్స్ ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు.
ఒక్కో రౌండ్ లో 9 వేల నుండి 10 వేల ఓట్ల లెక్కింపు జరుగనుంది. కోవిడ్ నిబంధనల మేరకు రెండు హాల్స్ లో కౌంటింగ్ జరుగనున్నట్లు సమాచారం అందుతోంది. ఇక ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నదానిపైనే అందరి దృష్టి ఉంది. ఉదయం 9 గంటల వరకు దీనిపై కాస్త క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్.... గెలుస్తారని... ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఇప్పటికే పేర్కొన్న సం గతి మ న అం ద రికీ విధి తమే.