ఎన్టీఆర్ తర్వాత జగన్కే ఆ రికార్డు..!
దీంతో పాటు శ్రీకాకుళం ... విజయనగరం జిల్లాలకు ఒడిషాతో దశాబ్దాల తరబడి చాలా సరి హద్దు వివాదాలు ఉన్నాయి. వీటిని పరిష్కరించుకు నేందుకు ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా దీనిపై కాన్ సంట్రేషన్ చేయలేదు. అయితే ఇందు కోసమే జగన్ ఈ నెల 9న ఒడిషా టూర్ వెళుతున్నారు. జగన్ ఈ టూర్ లో ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ తో ఆయన ముఖా ముఖీ చర్చలు జరిపేందుకు రెడీ అవుతున్నారు.
ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లా లో వంశధార నది మీద నిర్మించే నేరేడు బ్యారేజ్ విషయంలో ఒడిషా అభ్యంతరాలకు జగన్ క్లారిటీ ఇస్తారని అంటున్నారు. అదే జరిగితే శ్రీకాకుళం జిల్లాకు చాలా వరకు సాగు, తాగు నీటి విషయంలో న్యాయం జరుగుతుంది. ఇక విజయనగరం జిల్లాలో కొటి యా గ్రామాలు 21 వరకు ఉన్నాయి. వీటి విషయంలో కూడా ఒడిశాతో పంచాయితీ నడుస్తోంది. దీనిని కూడా జగన్ పరిష్కరిస్తారట.
ఇక గతంలో ఎన్టీయార్ తరువాత మరే ముఖ్యమంత్రి ఒడిషా వెళ్లి చర్చలు జరపలేదు. ఇప్పుడు ఇన్నేళ్లకు జగన్ ఆ రికార్డును చేరుకోబోతున్నారు. మరి జగన్ చర్చలు ఎంత వరకు ఫలిస్తాయో ? చూడాలి.