కార్తీక పౌర్ణమి దీపం.. ప్రాణం తీసింది?

praveen
హిందువులందరూ కార్తీక మాసం ఎంతో పవిత్ర మాసం గా భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎప్పుడూ చేయనంతగా కార్తీక మాసంలో పూజలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ప్రతి రోజూ ఎంతో శుద్ధిగా దేవుడికి పూజ చేయడంతోనే రోజును ప్రారంభిస్తూ ఉంటారు. అయితే కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి ని మరింత ప్రత్యేకంగా భావిస్తూ ఉంటారు. కార్తీక పౌర్ణమి రోజున ఎంతోమంది ఆలయాలకు వెళ్లి దీపాలను వెలిగించడం వంటివి చేస్తూ ఉంటారు. దీంతో ఇక కార్తీక పౌర్ణమి రోజున ఎక్కడ చూసినా కూడా దీపాల వెలుగులు కనిపిస్తూ ఉంటాయి. ఇక ప్రతి ఒక్కరూ దగ్గరలో ఉన్న చెరువుల దగ్గరకు వెళ్లి కార్తీకదీపాలను నీటిలో వదలడం లాంటివి చేస్తూ ఉంటారు.


 ఇలా చేయడం వల్ల ఎంతో మంచి జరుగుతుందని దేవుడి ఆశీస్సులు లభిస్తాయి అని ప్రతి ఒక్కరూ ప్రగాఢంగా విశ్వసిస్తుంటారు. అందుకే చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ కూడా కార్తీక పౌర్ణమి రోజున ఇలా దేవుడికి పూజ చేసి దీపాలు వెలిగించడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఇలా దీపాలు వెలిగించడం ఇక్కడ ఇద్దరు దంపతులు ప్రాణాలు పోవడానికి కారణం అయింది. కార్తీక పౌర్ణమి రోజున దీపాలు వెలిగించడానికి వెళ్లిన దంపతులు ఇద్దరూ కూడా ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన కర్నూలులో వెలుగులోకి వచ్చింది.


 దీపాలు వెలిగించేందుకు  వెళ్లి ప్రమాదవశాత్తు ఇద్దరు భార్యాభర్తలు కాలువలో పడి మృతి చెందారు. కర్నూలులోని అబ్బాస్ నగర్ లో రాఘవేంద్ర ప్రసాద్, ఇందిరా అనే భార్య భర్తలు నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే కార్తీక పౌర్ణమి కావడంతో రాఘవేంద్ర ప్రసాద్ దంపతులు ఇటీవలే వినాయక ఘాట్ వద్ద కేసీ కాల్వ పక్కనే ఉన్న గుడికి వెళ్లారు. ఇందిరా కాలువ లో దీపం వదిలేందుకు వెళ్లారు. దీంతో అదుపుతప్పి అందులో పడిపోయారు. అయితే భార్య ను కాపాడేందుకు వెళ్లిన భర్త రాఘవేంద్ర ప్రసాద్ కాలువలో పడిపోయారు. దీంతో స్థానికులు వారిని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రవాహం ఉదృతంగా ఉండటం తో చివరికి ఇద్దరు కొట్టుకుపోయారు. చివరికి ఘటనా స్థలం నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో వీరి మృతదేహాలనులభ్యమయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: