ఆ రైతులకు.. సాయం కుదరదు..!
కానీ ఉద్యమం నడిపిస్తున్నదే ప్రభుత్వం పై మచ్చ తేవడానికి. తద్వారా తరువాత జరగబోయే ఎన్నికలలో కాస్త గ్రాఫ్ పడిపోతుంది, అది తమకు అనుకూలంగా ఉంటుంది అనేది విపక్షాల రాజకీయ కుట్ర. పరిస్థితి ఏమిటి వాళ్ళు ఆలోచిస్తున్న తీరు ఏమిటి అనేది చుస్తే చాలు వాళ్ళ మనస్తత్వాలు ఏమిటో చెప్పడానికి. ఒక్కసారి పార్లమెంట్ సరిగ్గా జరగనిస్తే, రైతు చట్టాలు మొదటి రోజే సభలో ప్రవేశపెట్టి రద్దు చేసేయాలని కేంద్రం యోచించింది. అలా జరిగిపోతే రైతులు తమ ఇళ్లకు వెళ్లిపోయే ప్రమాదం ఉందని, రైతు సంఘాలను రెచ్చగొట్టి పరిహారాలని కొత్త నాటకం తెరపైకి తెస్తున్నాయి విపక్షాలు.
అసలు అంతమంది రైతులు చనిపోయారో లేదో తెలియదు, అంతమంది నిజంగా చనిపోతే రైతులు ఇంత శాంతియుతంగా ఉద్యమం చేస్తారా అనేది అప్పటికి రావాల్సిన ప్రశ్న. అయినా ఉద్యమం లో అప్పుడప్పుడు అల్లర్లు జరిగినప్పటికీ ఇంత భారీగా రైతులు మరణించి ఉంటె దానికి తగిన నివేదికలు కూడా ప్రభుత్వం దగ్గర ఖచ్చితంగా ఉంటాయి. కనీసం ఆయా మృతదేహాలకు జరిగిన శవపరీక్ష లాంటివి అయినా ప్రభుత్వం దగ్గర ఉండాలి. అవన్నీ ఉన్నది లేనిది కూడా గ్రహించకుండా ఏదోఒక లెక్క చూపించి కొత్త రగడ పేరుతో ఉద్యమాన్ని కొనసాగించాలని చూస్తే, దానిని ప్రభుత్వం సహకరించకుండా తగిన జవాబు చెప్పేసింది. అయితే ఇప్పటికి రైతు సంఘాల నుండి ఉన్న డిమాండ్స్.. తమ మీద ఉన్న కేసులు కొట్టేయాలి, మద్దతు ధర, విద్యుత్ చట్టంపై పునరాలోచన, మరణించిన రైతుల కుటుంబాలకు ఆర్థికసాయం.