టిమ్స్ ఆసుపత్రిలో కరోనా కలకలం..!
మొదటిసారిగా దక్షిణాఫ్రికాలో గుర్తించిన ఓమిక్రాన్ వేరియంట్ నెల తిరక్కుండానే ఇప్పటికే చాలా దేశాలకు విస్తరించింది. తాజాగా భారత్లోనూ ఓమిక్రాన్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నది.
ఇంతలోనే కలవరపాటుకు గురి చేసే మరో పరిణామం చోటు చేసుకుంటుందని విదేశాల నుంచి హైదరావబాద్ ఎయిర్ఫోర్ట్కు వచ్చిన వారిలో 13 మందికి కరోనా వైరస్ పాజిటివ్గా తేలినది. దీంతో ఆందోళన కలిగిస్తోంది. ఓమిక్రాన్ వైరస్ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు నిర్వహించిన పరీక్షలలో 13 మందికి పాజిటివ్గా తేలిందని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే పాజిటివ్ వచ్చిన వారిని గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి నుంచి శాంపిల్స్ను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నదని వైద్యులు పేర్కొంటున్నారు. కరోనా సోకిన వారికి వేరియంట్పై స్పష్టత రావాల్సి ఉన్నది. రిపోర్టు రావడానికి రెండు నుంచి మూడు రోజుల సమయం పడుతుందని వైద్యాధికారులు