బాబు ఢిల్లీ టూర్ ఏమైంది...?
దానికి తోడు అమరావతి ఉద్యమానికి భారతీయ జనతా పార్టీ మద్దతు పలకడంతో టీడీపీ అధినేత కాస్త ఉత్సాహంగా ఉన్నారని వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తో పాటుగా భారతీయ జనతా పార్టీని కూడా కలుపుకుని తాగితే మంచి ప్రయోజనం ఉంటుందనే భావన లో చంద్రబాబునాయుడు అన్నారు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సమయంలో చాలా మంది భారతీయ జనతా పార్టీ పెద్దలు ఆయనను కలవడానికి ఇష్టపడకపోవడం ప్రధానంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయన కలవకపోవడం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆయనను కలిసేందుకు ఇష్టపడకపోవడం తో చంద్రబాబు నాయుడు కాస్త డీలా పడ్డారు అని వార్తలు వచ్చాయి.
చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా కొంత మంది కేంద్ర మంత్రులకు అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు మీ కలిసే ప్రయత్నం చేయగా అది అంతగా ఫలించలేదని అర్థమైంది. అయితే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉందని దీనికి సంబంధించి టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఏర్పాట్లు కూడా చేస్తున్నారని టీడీపీ అనుకూల మీడియా లో వార్తలు వచ్చినా సరే అది నిజం కాదని తెలిసింది.