భావన ఇంటి పెద్దగా సాగుతుంది.అంతేకాకుండా భూస్వామిక విలువల ఆధారంగా ఏర్పడిన కులవ్యవస్థ లక్షణాలన్నీ కుటుంబంపై కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. అదేవిధంగా పితృస్వామిక ఆధిపత్యం ఉంటుంది.వీటికి మహిళలల కుటుంబ సభ్యుల సమ్మతి కూడా ఉంటుంది. అయితే సమాజ జీవనంలో క్రమంగా అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. భూమిపై ఉండే యాజమాన్య ఆలోచనలు మారాయి. పంటలు పండించాలన్న దాని నుండి సంపద సృష్టించుకోవాలనే భావన పోయి, భూమిని వ్యాపార సరుకుగా మార్చి వేయడం జరిగింది.దీంతో దానికి సంబంధించిన అన్ని సంబంధాల్లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి.