మాస్కు నిర్లక్ష్యం.. ఏడాదిలో సర్కారుకు ఇన్ని కోట్లు వచ్చాయా..!

MOHAN BABU
మాస్కు ధరించని నిర్లక్ష్యం ఖరీదు 31 కోట్లు. ఎస్ మీరు వింటున్నది నిజమే. ఏడాది వ్యవధిలో మాస్క్ ధరించని వారికి ప్రభుత్వం విధించిన జరిమానా ఇది.పది రూపాయల మాస్క్ తో ముక్కు మూతి మూసుకో వడానికి నిర్లక్ష్యం వహించిన వారు వెయ్యి రూపాయల చొప్పున చేతి చమురు వదిలించుకున్నారు.మళ్లీ థర్డ్ వేవ్ తప్పదని. కొత్త వేరియంట్ రూపంలో ఓమిక్రాన్ ముప్పు ముంచుకొస్తుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మాస్క్ రూల్ మస్ట్  గా మారింది.. మరోసారి జరిమానాలు చర్చనీయాంశంగా మారాయి. కోవిడ్ మహమ్మారి మూడో ముప్పు,దానికితోడు కొత్త వేరియంట్ విజృంభిస్తున్న  తరుణంలో మరోసారి ప్రభుత్వం ఉపక్రమించింది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మార్పు ధరించాలనే నిబంధనలు విధించింది.


 మాస్క్ లేకుండా విచ్చలవిడిగా తిరిగే వారికి రూ.వెయ్యి జరిమానా విధించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రతిరోజు తనిఖీలు నిర్వహిస్తుంది. రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలోని పోలీసు సిబ్బంది ప్రతిరోజు తనిఖీలు చేస్తున్నారు.ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఇళ్ల నుంచి బయటకు వస్తే మాస్కు ధరించి రావాలని సూచిస్తున్నారు. అయినా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మాస్క్ ధరించకుండా రోడ్లపైకి వస్తున్న వారికి పోలీసులు జరిమానా విధిస్తున్నారు. వాహనదారులు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. 2020 సంవత్సరంలో మార్చి నెలలో దేశవ్యాప్తంగా మొదటి దఫా కరోణా వ్యాప్తి మొదలైంది.. కరోణా నుండి రక్షణ పొందాలంటే మాస్క్ తప్పనిసరని  వైద్యులు సూచించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అదే సూచించింది. ఒక్క వరంగల్ జిల్లాలోనే ఇలా ఏడాది వ్యవధిలో మాస్క్ నిబంధనలు ఉల్లంఘించిన 3,26,858 మందికి జరిమానాలు విధించారు. వీరంతా 31 కోట్ల రూపాయలు జరిమానా రూపంలో చెల్లించారని పోలీస్ క్రైమ్ రికార్డ్స్ చెబుతున్నాయి. మరోవైపు కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత మరింత నిర్లక్ష్యం పెరిగింది. చాలామంది మాస్కులు తీసేసారు.కనీసం గుంపులుగా ఉన్నచోట రాజకీయ సమావేశాలు, శుభకార్యాలు, పబ్లిక్ ప్లేస్, షాపింగ్ మాల్స్,సినిమా థియేటర్లలో కూడా మాస్క్ ధరించడం లేదు. పది రూపాయలు పెట్టి మూతికి మాస్క్ పెట్టుకోవడానికి నిర్లక్ష్యం వహిస్తున్న వారు రూ. 1000  జరిమానా చెల్లించి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. ఓమిక్రాన్ ముప్పు ముంచుకొస్తుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వరంగల్ లో పోలీసులు మాస్క్ రూల్ మస్ట్ చేశారు. ఎవరికి వారు మాస్క్ ధరించి స్వీయ  రక్షణ పొందాలని సూచిస్తున్న పోలీసులు మాస్క్ ధరించని వారు  తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు. మాస్క్ నిర్లక్ష్యం ఖరీదు పెరిగి పెద్దదై కోట్ల రూపాయల జరిమానా గా మారగా ఇదే నిర్లక్ష్యం కొందరి ప్రాణాలు మింగేసింది. ఇక థర్డ్ వేవ్ ముందుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: