మైదుకూరు-ప్రొద్దుటూరులపై తమ్ముళ్ళ ఆశలు..!
భవిష్యత్లో కూడా వైసీపీకే అండగా ఉంటారు...ఇందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఏదో రకంగా జిల్లాలో ఒకటి, రెండు సీట్లు అయిన గెలుచుకోవాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తుంది. గత మూడు ఎన్నికలని చూసుకుంటే జిల్లాలో టీడీపీ పెద్దగా సత్తా చాటలేకపోయింది. 2009 ఎన్నికల్లో ఒక ప్రొద్దుటూరు సీటు గెలుచుకోగా, 2014 ఎన్నికల్లో రాజంపేట సీటు గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో అయితే...10 సీట్లలోనూ ఓడిపోయింది. మరి 2024 ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయో కూడా ఊహించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మరే 10 సీట్లలో ఓడిపోకుండా...కనీసం ఒకటి రెండు సీట్లు అయిన గెలుచుకుంటే పరువు నిలబడుతుందని టీడీపీ చూస్తుంది.
ఈ క్రమంలోనే టీడీపీ మైదుకూరు, ప్రొద్దుటూరు సీట్లపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల కాస్త ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్తితి మెరుగైనట్లు కనిపిస్తోంది. అలా అని వైసీపీని పూర్తిగా డామినేట్ చేసేలా మాత్రం టీడీపీ రాలేదు. కానీ ఎలాగోలా నెక్స్ట్ ఎన్నికల్లోపు ఇంకా కష్టపడితే ఒక సీటు అయిన గెలుచుకోలేమా అని చూస్తున్నారు. అయితే మైదుకూరులో టీడీపీకి కాస్త ప్లస్ కనబడుతోంది. చూడాలి మరి కడపలో టీడీపీ ఏ మేర సత్తా చాటుతుందో.