చంద్రబాబుకు అగ్రనేతల షాక్

Vijaya


అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో తిరుపతిలో జరిగిన బహిరంగసభ సందర్భంగా చంద్రబాబునాయుడుకు మూడుపార్టీల అగ్రనేతలు పెద్ద షాకే ఇచ్చారు. అమరావతిని మాత్రమే ఏకైక రాజధానిగా కంటిన్యుచేయాలనే డిమాండ్ తో అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో పాదయాత్ర జరిగింది. తమ యాత్ర ముగింపు సందర్భంగా తిరుపతిలో పెద్ద బహిరంగసభ జరిగింది. అమరావతికి అధికారపార్టీ తప్ప మిగిలిన అన్నీ పార్టీలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లుగా కలరింగ్ ఇవ్వాలని టీడీపీ ముసుగులో అమరావతి జేఏసీ నిర్వాహకులు చాలా కష్టపడ్డారు.



పైకి కనబడుతున్నది అమరావతి జేఏసీనే కానీ మొత్తం వ్యవహారాన్ని నడిపింది టీడీపీయే అన్న విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబునాయుడు బ్యాకప్ తోనే దీక్షలైనా, పాదయాత్రైనా, బహిరంగసభ అయినా జరిగిందన్నది బహిరంగ రహస్యం. ఈ బహిరంగసభకు ప్రతిపక్షాలన్నింటినీ పిలిచారు. ప్రతిపక్షాల రాష్ట్రాల అధ్యక్షులు, కార్యదర్శులు తప్పకుండా రావాలని కూడా కోరారు. అయితే బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, సీపీఎం కార్యదర్శి మధు మాత్రం బహిరంగసభకు హాజరుకాలేదు.



వీర్రాజు, పవన్ కూడా బహిరంగసభకు హాజరవుతారని చంద్రబాబుతో చేతులు కలుపుతారని బాగా ప్రచారం జరిగింది.  వీర్రాజు, పవన్ బహిరంగసభకు హాజరవ్వటం చంద్రబాబుకు చాలా అవసరం. ఎందుకంటే పొత్తుల కోసం చంద్రబాబు అల్లలాడుతున్నారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసేంత సీన్ చంద్రబాబు లేదన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకనే వీలైతే బీజేపీ, జనసేనలతో ఎలాగైనా పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు తహతహలాడుతున్నారు.



పాదయాత్రకు దూరంగా ఉన్న బీజేపీ, జనసేన నేతలను పాల్గొన్నారు. మొదట్లో ఈ రెండుపార్టీల నేతలు దూరంగానే ఉన్నా తెరవెనుక జరిగిన పరిణామాలతో బీజేపీ, జనసేన నేతలు కూడా పాదయాత్రలో పాల్గొనాల్సొచ్చింది. కాబట్టి టీడీపీ+బీజేపీ+జనసేనలు పొత్తులు పెట్టుకోవటమే మిగిలిందన్నట్లుగా ప్రచారం జరిగింది. పాదయాత్రలో పాల్గొన్న రెండు పార్టీల అగ్రనేతలు చివరకు బహిరంగసభకు మాత్రం డుమ్మాకొట్టేశారు. దీంతో చంద్రబాబుకు పెద్ద షాక్ తగిలినట్లయ్యింది. కేంద్రంలో జరిగిన పరిణామాల కారణంగానే వీర్రాజు బహిరంగసభకు గైర్హాజరైనట్లు సమాచారం. బీజేపీలో పాల్గొనలేదు కాబట్టి పవన్ కూడా హాజరుకాలేదు. మొత్తానికి అమరావతి పాదయాత్ర  క్లైమ్యాక్స్ మాత్రం చంద్రబాబుకు షాక్ కొట్టిందనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: