వంగవీటి రాధా పరువు తీసిన వైసీపీ.. !?

Veldandi Saikiran
విజయవాడ : వంగవీటి రాధా, రాధా రెక్కీ అంశంపై మంత్రి వెల్లంపల్లి హాట్ కామెంట్స్ చేశారు.  హత్యకు రెక్కీ ఆధారాలు ఉంటే రాధా బయట పెట్టాలని డిమాండ్ చేశారు మంత్రి వెల్లంపల్లి.  రెక్కీ ఎవరు చేయబోయారో రాధా బయటపెట్టాలని.. రాజకీయ లబ్ది కోసం రాధా చంద్రబాబు చెప్పినట్టు చేయకూడదని నిప్పులు చెరిగారు మంత్రి వెల్లంపల్లి.

ఇప్పటికే రాధాను రాజకీయాల్లో మర్చిపోయారని.. చంద్రబాబు తప్పుడు డైరెక్షన్ లో రాధా ప్రయాణం చేయకూడదని అగ్రహించారు మంత్రి వెల్లంపల్లి. రంగా టీడీపీ హయాంలో ఎందుకు దీక్ష చేశారు రాధా తెలుసుకోవాలని.. టీడీపీ హయాంలో రంగా హత్య జరిగితే అదే పార్టీతో రాధా అంటకాగుతున్నారని మండిపడ్డారు మంత్రి వెల్లంపల్లి. చంద్రబాబుతో ప్రభుత్వంపై రాధా మాట్లాడిస్తున్నారని.. రెక్కీపై ఇంతవరకు పోలీసులకు ఫిర్యాదు చేసారా ? అని ప్రశ్నించారు. మెయిన్ రోడ్డులో రాధా ఇల్లు ఉంది, అక్కడ కారు తిరిగితే రెక్కీ అవుద్దా ?హత్యా రెక్కీ అంటారన్నారు మంత్రి వెల్లంపల్లి.  భద్రతకి గన్ మెన్లను పంపితే వెనక్కి పంపి చీప్ రాజకీయాలు చేస్తారా? అని నిలదీశారు మంత్రి వెల్లంపల్లి .

రాధా రెక్కీ అంశంపై వెంటనే స్పందించిన వ్యక్తి సీఎం జగన్ అని..  రాధా మా పార్టీకి సంబందంలేని వ్యక్తయినా గన్ మెన్లను కేటాయించార న్నారు మంత్రి వెల్లంపల్లి .  రాధాకు చంద్రబాబు పరామర్శ దొంగలు పడిన 6 నెలలకు కుక్కలు మొరిగానట్టు ఉందని చురకలు అంటించా రు మం త్రి వె ల్లం పల్లి.  రాధా అను మానం ఉందని ఏనా డైనా చెప్పారా ? అసెంబ్లీ లో  భువనే శ్వరి గు రించి మాట్లాడకపోయినా చంద్రబాబు సింపతీ కోసం ఎక్కెక్కి ఏడ్చాడని పేర్కొన్నారు మంత్రి వెల్లంపల్లి.  రాజకీయాలో ఎంతకైనా దిగజారే వ్యక్తి చంద్రబాబు అని.. వంగవీటి రాధాతో చంద్రబాబు డ్రామా చేయిస్తున్నాడని ఫైర్ అయ్యారు మంత్రి వెల్లంపల్లి.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: