వామ్మో.. పెళ్లాంతో లింకు పెట్టుకున్నాడని.. ఎంత ఘోరంగా చంపాడో..?
ఈ విషయాన్ని సూర్యాపేట జిల్లాలో జరిగిన ఓ యువకుడి దారుణ హత్య మరోసారి నిరూపించింది. తన భార్యతో సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో ఓ భర్త భార్య ప్రియుడిని దారుణంగా చంపాడు.. పొలంలో ట్రాక్టర్తో ఢీకొట్టించి దమ్ము చక్రాలతో తొక్కించి మరీ చంపేశాడు. ఈ దారుణ ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం లక్కవరంలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. లక్కవరం గ్రామానికి చెందిన బాతుక మహేశ్ ఓ రైతు. అన్న నాగరాజు పొలంలో నాట్లు వేసే పనికి వెళ్లాడు. నాట్లు ముగిసిన తర్వాత కూలీలను దింపడానికి నాగరాజు ట్రాక్టర్ తీసుకుని వెళ్లిపోయాడు. ఆ తర్వాత మహేశ్ బండిపై ఇంటికి బయల్దేరాడు. అయితే.. అదే గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ పొలాన్ని దమ్ము చేసి అదే రూట్లో వెళ్తున్నాడు. ఒంటరిగా వెళ్తున్న మహేశ్ను ఆ ట్రాక్టర్ డ్రైవర్ చూశాడు.
ట్రాక్టర్తో మహేశ్ బండిని ఢీకొట్టాడు. మహేశ్ బండితో పాటు పక్కన దమ్ము చేసిన మడిలో పడిపోయాడు. అంతే ఆ ట్రాక్టర్ డ్రైవర్ వెంటనే ట్రాక్టర్ను మహేశ్ పై నుంచి తొక్కించేశాడు. హత్య తర్వాత ఆ ట్రాక్టర్ను అక్కడే వదిలేసి పారిపోయాడు. అసలు ఇదంతా ఎందుకు జరిగిందంటే.. ట్రాక్టర్ డ్రైవర్ భార్యకు మహేశ్తో అక్రమ సంబంధం ఉందట. ఇదే విషయంపై గతంలో ఓసారి పెద్ద మనుషుల పంచాయితీ కూడా జరిగిందట. అయినా మహేశ్ తన భార్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని భర్తకు అనుమానం వచ్చింది. అదే మహేశ్ పాలిట మృత్యుపాశమైంది.