ఓరి నాయనో.. 3 సెకన్లకి ఒక కేసు?

praveen
కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తుంది. అగ్రరాజ్యాల లో అయితే మరింత వణికిస్తోంది. ఇప్పటికే అతి ఎక్కువ కరోనా వైరస్ ప్రభావం ఎదుర్కొన్న దేశంగా ఉంది అగ్రరాజ్యమైన అమెరికా. ఇక ఇప్పుడు అక్కడ మూడవ దశ ప్రారంభమైంది అనేది తెలుస్తుంది. ప్రతిరోజు లక్షల కేసులు వెలుగులోకి వస్తూ ఉండడం ఆందోళనకరంగా మారిపోతుంది. రోజురోజుకు వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో ఎన్నో నగరాల్లో లాక్ డౌన్ విధించే  పరిస్థితులు వస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
 అగ్రరాజ్యమైన అమెరికా లో ఒకే రోజు ఏకంగా ఆరు లక్షలకు పైగా కేసులు వెలుగులోకి రావడం సంచలనం గానే మారిపోయింది అన్న విషయం తెలిసిందే.



 దీంతో వైరస్ బారినపడి ఏ క్షణంలో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందో అని అమెరికా ప్రజానీకం మొత్తం భయం గుప్పిట్లో బ్రతుకుతుంది. ప్రజలందరూ కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు అమలులోకి తీసుకు వచ్చినప్పటికీ అక్కడ కేసుల్లో మాత్రం ఎక్కడా తేడా కనిపించడం లేదు. రోజురోజుకీ పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడా తగ్గడం లేదు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం అమెరికాలో కేసులు పెరిగిపోతున్న పరిస్థితులు చూస్తూ ఉంటే ప్రపంచ దేశాలు సైతం ఎక్కడ తమ దేశంలో కూడా అలాంటి పరిస్థితి వస్తుందో అని భయాందోళనలో మునిగిపోతున్నాయి.


 మొన్నటికి మొన్న ఒక్క నిమిషానికి ఒక కేసు నమోదయ్యింది అమెరికాలో. ఇటీవల 7 సెకండ్ కి ఒక కేసు  నమోదు అయ్యింది. ఇక ఇప్పుడు ఏకంగా మూడు సెకన్ల కి అమెరికాలో ఒక కేసు నమోదు అవుతుంది అని ప్రస్తుతం వెలుగులోకి వస్తున్న కేసులు శాస్త్రవేత్తలు నివేదికలు చెబుతున్నాయి. దీంతో అమెరికాలో పరిస్థితులని ఆందోళనకరంగా మారిపోతున్నాయ్. మరి కొన్ని రోజులపాటు ఇలా కేసులు పెరిగితే ఇక అమెరికాలోమళ్లీ సంపూర్ణ లాక్ డౌన్ అమలులోకి వచ్చే అవకాశం కూడా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: