నువ్వు, నేను,మనం.. ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఇలాంటి మాటలే రీ సౌండ్ కాబోతున్నాయా అంటే ఏమో గుర్రం ఎగరావచ్చు అన్న సామెతే వినిపిస్తుంది. తన నిర్ణయాలతో,పరిపాలనతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న తమిళనాడు సీఎం
స్టాలిన్ ఇప్పుడు ఒక్క
లేఖ తో అందరి చూపు
చెన్నై వైపు మళ్లేల చేశాడు. ఈ
లేఖ కొత్త చర్చకు దారితీసింది.
కాంగ్రెస్ బలహీనమైన వేళ
బిజెపి వర్సెస్ మిగతా పార్టీలు అన్నట్లుగా రాజకీయం మారింది.
స్టాలిన్ మాత్రమే కాదు, కెసిఆర్ అయినా,దీదీ అయిన వారి స్టేట్మెంట్లు, చర్యలు చెబుతున్నది కూడా అదే. ప్రస్తుతానికి విడివిడిగా ఉన్నట్లు కనిపిస్తున్నా వాళ్ళందరూ కలిసి పోరాటం చేసేందుకు కార్యాచరణ కూడా సిద్ధం చేస్తున్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక్క లేఖతో కేంద్రంపై సమరానికి సిద్ధమని
స్టాలిన్ చెప్పగా, మాటలతో దీదీ,కేసీఆర్ అదే అంటున్నారు. మరి ఇలాంటి సమయంలో రాజకీయం ఎలా మారబోతుంది? ప్రాంతీయ పార్టీలకు ఒక
వేదిక తయారు కాబోతోందా? ముగ్గురు వేర్వేరు గా కనిపిస్తున్నా,ముగ్గురు కలిసి మరో ముప్పై మందిని ఏకం చేయబోతున్నారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.సామాజిక న్యాయం,సమానత్వాన్ని సాధించేందుకు అన్ని పార్టీలు ఒక్క తాటిపైకి రావాలని
స్టాలిన్ లేఖ రాశారు.
బీజేపీ కి వ్యతిరేకంగా కొత్త వేదికను తయారు చేయడమే
లేఖ ఉద్దేశం అన్నది క్లియర్ గా అర్ధం అవుతుంది. అలాగే కేంద్రం పై గురి పెట్టిన వారిలో దీదీ,కేసీఆర్ కూడా ఉన్నారు.
బెంగాల్ లో హ్యాట్రిక్ కొట్టిన తర్వాత మమతలో
జోష్ పెరిగింది. లేఖతో ఒకరు,పక్క
పార్టీ వారిని లాగేస్తూ మరొకరు, అందరినీ కలిసి పరిస్థితిని వివరిస్తూ ఇంకొకరు. ఇలా అన్నీ వేర్వేరు దారులైన వారి వ్యూహాల్లో కనిపిస్తున్న కామన్ పాయింట్ మాత్రం ఒక్కటే. అదే ప్రాంతీయ పార్టీలను ఏకం చేయాలని,
బిజెపి ని గద్దె దించాలని.
స్టాలిన్ లేఖాస్త్రాన్ని సంధించినా, దీదీ దేశం మొత్తం చుట్టేసినా, కేసిఆర్ తన మార్కు డైలాగులతో దంచికొట్టిన గురి పెట్టింది
ఢిల్లీ వైపే.వీరి చేతిలోని ఆయుధాలు వేరైనా లక్ష్యం ఒక్కటే,
వేదిక వేరైనా మార్గం ఒక్కటే, అంశాలు వేరైనా ఆశయం ఒక్కటే, థర్డ్ ప్రాసెస్ వేరైనా టార్గెట్ ఒక్కటే అన్నది మాత్రం వాస్తవం.