భారత రాజ్యంగంపై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్. రాజ్యాంగం మార్చాలని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను రాద్దాంతం చేస్తున్నారని.. దేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉందా ? అని నిల దీశారు మంత్రి కేటీఆర్. దేశంలో నరేంద్రమోడీ రాజ్యాంగం నడుస్తోందని.. తెలంగాణ ఆర్టికల్-3 ప్రకారమే ఏర్పడిందని నిప్పులు చెరిగారు మంత్రి కేటీఆర్. రాజ్యాంగ సంస్థలన్నింటినీ మోడీ తన గుప్పిట్లో పెట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. గవర్నర్ వ్యవస్థని, ఈసీని మోడీ గుప్పిట్లో పెట్టుకున్నారన్నారు మంత్రి కేటీఆర్. ప్రధాని నరేంద్ర మోడీ ఆడించినట్లు ఈ వ్యవస్థలు ఆడేలా చూస్తున్నారని నిప్పులు చెరిగారు మంత్రి కేటీఆర్. పశ్చిమ బెంగాల్లో గవర్నర్ను సీఎం బ్లాక్ చేసే పరిస్థితి వచ్చిందన్నారు మంత్రి కేటీఆర్. సీఎంకు, గవర్నర్ వ్యవస్థకు మద్య అగాధాన్ని తెచ్చారని మండిపడ్డారు మంత్రి కేటీఆర్.
అమ్మాయిలు చదువుకోడానికి వెళ్తే క ర్ణా టక లో బెదిరిస్తున్నారని.. ఇదేనా మీరు కోరుకున్న భారతదేశమన్నారు మంత్రి కేటీఆర్. విద్యార్థుల మనసులో మతం పేరుతో విషం నింపుతున్నారని.. మ త వి ద్వే షాలు రె చ్చగొట్టి చలికాచు కోవాలనేదే బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తుందని నిప్పులు చెరిగారు మంత్రి కేటీఆర్. విగ్రహావిష్కరణ కోసం వచ్చారని.. పచ్చని పొలాలను చూసి మోడీకి కడుపు మంట అని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్. గుజరాత్ కంటే అభివృద్ధిలో ముందుకు పోతుందని వి షం చిమ్మారని.. గుండెళ్ళో గునపాలు దింపెలా మాట్లాడారన్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్. అమరవీరుల త్యాగాలను అవమానించారని... మో డీ ది పనికిమాలిన కూత అన్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్. దేశానికి ప్రధాని గా ఇలా మాట్లాడతారా ? తల్లిని చంపి బిడ్డను ఇచ్చారని మోడీ ఎనిమిదేళ్ళ క్రితం అన్నాడని చెప్పారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్.