హీరో మోహన్ బాబుతో మంత్రి పేర్ని నాని భేటీ..

Purushottham Vinay
టాలీవుడ్ సీనియర్ హీరో ఇంకా నిర్మాత డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబుతో ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని భేటీ అయ్యారని వార్తలు  వస్తున్నాయి. ఇక అధికారంగా దీని గురించిన పూర్తి వివరాలు అనేవి తెలియాల్సి వుంది.ఇక గురువారం ( ఫిబ్రవరి 10) మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో టాలీవుడ్ హీరోలు మహేష్ బాబు, ప్రభాస్ ఇంకా డైరెక్టర్ రాజమౌళి లాంటి ప్రముఖుల బృందం సమావేశమైన విషయం తెలిసిందే. సినిమా టికెట్ ధరలు ఇంకా అలాగే చిన్న చిత్రాలకు కూడా ఐదో షోకు అనుమతి వంటి పలు ఇతర విషయాలపై చర్చించారు. అయితే ఈ భేటీలో సీనియర్ హీరో మోహన్ బాబు కనిపించలేదు.


ఇక ఈ రోజు (ఫిబ్రవరి 11) మోహన్ బాబును హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మంత్రి పేర్ని నాని కలవడంపై ప్రాధాన్యం అనేది సంతరించుకుంది. ఏపీలో సినిమా టికెట్ రేట్లతో పాటుగా అనేక కీలక అంశాలపై వీరిద్దరూ కూడా చర్చించినట్టు సమాచారం తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి బృందంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి భేటీ వివరాలను మోహన్ బాబుకు సినిమాటోగ్రఫీ మంత్రి వివరించినట్లు సమాచారం అనేది తెలుస్తోంది.ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది ఇంకా తెలియాల్సి ఉంది.


ఇక ఇదిలా ఉంటే సినిమా రంగానికి సంబంధించిన సమస్యలన్నింటికీ ఓ పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చిన సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి .. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం అనేది తెలుస్తోంది.ఇక ఇందులో భాగంగా సినిమా టికెట్ల అంశం మీద ఏపీ సర్కారు నియమించిన కమిటీ.. ఫిబ్రవరి 17 వ తేదీ న సమావేశం కానుంది. సభ్యులకు ఇప్పటికే ఉన్నతాధికారులు సమాచారం పంపడం అనేది జరిగింది.సినీ ఇండస్ట్రీ పెద్దలు అందరూ కూడా సీఎం ముందుంచిన ప్రతిపాదనలపై ఈ భేటీలో చర్చించనున్నారు. టికెట్ ధరలు ఇంకా అదనపు షోలు ఇంకా అలాగే భారీ బడ్జెట్ చిత్రాలు వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇక ఈ క్రమంలోనే త్వరలోనే ఏపీ ప్రభుత్వం సవరణలతో కూడిన సరికొత్త జీవోని కూడా జారీ చేయనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: