జగ‌నన్న : చంద్రబాబుకు ఝ‌ల‌క్ ? మళ్లీనా!

RATNA KISHORE
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై ఈరోజు కేంద్రం ఓ స్పష్టమైన వైఖరిని వినిపించింది ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఓ లేఖ రాసింది.దీని ప్రకారం ఈనెల 17న మీరు తెలుగు రాష్ట్రాల చీఫ్ సెక్రెటరీ లతో భేటీ అయ్యే విషయమై ఓ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం అనుసారం 9 అంశాలతో కూడిన లేఖ ఒక‌టి ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీ లకు పంపింది. ఇప్పుడు ఇదే విషయమై చర్చ ఒక‌టి అంత‌టా నడుస్తోంది.ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై ఎప్పటి నుంచో సందిగ్ధత నెలకొని ఉంది. ఆంధ్ర ప్రదేశ్ కు విభజన చట్టం ప్రకారం ప్రత్యేక హోదా కల్పించాలని ఎప్పటి నుంచో టిడిపి పట్టుబడుతోంది. అయితే టిడిపి ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అని నినాదం ఒకటి వినిపించి ఢిల్లీ వీధులలో చర్చోప చర్చలు నడిపింది. తర్వాత కాలంలో మారిన పరిణామాల దృష్ట్యా తెలుగుదేశం పార్టీ తన వైఖరిని మార్చుకుంది.

తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మక రీతిలో తన వైఖరిని మార్చుకోవడం తో వివాదం ఆరోజు తలెత్తింది. ఆరోజు చంద్రబాబు హోదా అన్నది సంజీవని కాదని తేల్చేశారు. తర్వాత ప్యాకేజీ ప్రకారం నిధులు అందుకున్నారు అయితే ఆ రోజు కేంద్రంతో టీడీపీకి ఉన్న సఖ్యత రీత్యా ప్యాకేజీ కి సంబంధించి నిధులను బీజేపీ వెనువెంటనే విడుదల చేసింది. అయితే ఆ డబ్బులు కొంతమేర దుర్వినియోగం అయ్యాయని విమర్శలు మరియు అభియోగాలు వినవచ్చాయి.

తర్వాత మారిన ఈ పరిణామాల రీత్యా టిడిపి తన స్టాండ్ మార్చుకుంది బీజేపీతో తెగతెంపులు చేసుకుంది. కేంద్రంతో విభేదాలు తరువాత టిడిపి మళ్లీ హోదా విషయమై ఢిల్లీ కేంద్రంగా నిరసనలు వ్యక్తం చేసింది. అయితే ఈ నిరసనలు ఏవి ఫలించలేదు. కాలగతిలో జగన్ అధికారంలోకి వచ్చాక పరిణామాలు అన్నవి మారుతూ వచ్చాయి.ఇప్పుడు కేంద్రం ప్రత్యేక హోదా విషయమై రాష్ట్రానికి వరమందిస్తే చంద్రబాబుకు ఝ‌ల‌క్ తగలడం ఖాయం.ఈ నేపథ్యంలో మారుతున్న పరిణామాలు కొత్త  రాజ‌కీయాల‌కు కార‌ణం కానున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: