ఎన్నికల్లో బీజేపి నేతపై కాల్పులు.. అక్కడికక్కడే మృతి..!!

Purushottham Vinay
ఇక ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో శనివారం జరిగిన రెండో విడత(తుది) అసెంబ్లీ ఎన్నికలు చాలా హింసాత్మకగా మారాయి. ఒకవైపు ఉదయం 7 గంటలకే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవ్వగా మరోవైపు.. బీజేపీ నేతపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరపడం జరిగింది. ఇక ఈ ఘటనలో బీజేపీ నేత అక్కడికక్కడే కుప్పకూలిపోవడం అనేది జరిగింది. దీంతో ఆ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అయినప్పటికీ పటిష్ట బందోబస్తు మధ్య ఎన్నికలను ఆపకుండా నిర్వహించారు.ఓటింగ్ ప్రారంభమైన కొన్ని నిముషాలకే బీజేపీ కార్యకర్తపై కాల్పులు జరగడం తీవ్ర కలకలం రేపింది. ఇక ఈ ఘటనలో బీజేపీ నేత అముబా సింగ్ తన ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని బీజేపీ వర్గాలు ఆరోపించడం జరిగింది.

ఇక పోలింగ్ కి ముందు ప్రచారం నిర్వహించవద్దని కాంగ్రెస్ నేత ఇంటికి.. అముబా సహా బీజేపీ కార్యకర్తలు వెళ్లిన సమయంలో ఘర్షణ తలెత్తినట్లు సమాచారం అనేది తెలుస్తోంది.ఇక ఈ క్రమంలోనే అముబాపై కాల్పులు జరిగాయని సమాచారం తెలుస్తుంది.అలాగే మరో ఘటనలో బీజేపీ బహిష్కృత నేత ఇంటి వద్ద బాంబు దాడి అనేది జరిగింది.అలాగే మరోవైపు ఇన్ని ఘటనల నేపథ్యంలోనే మణిపుర్ అసెంబ్లీకి చివరిదైన రెండో దశ పోలింగ్ కూడా ముగిసింది. ఉద్రిక్త పరిస్థితుల మధ్య.. ఆరు జిల్లాల్లోని 22 నియోజకవర్గాలకు ఓటింగ్ కంప్లీట్ అయ్యింది. మధ్యాహ్నం 3 గంటల వరకు 67.77 శాతం ఓటింగ్ నమోదవ్వడం అనేది జరిగింది. ఇక ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 4 గంటల దాకా కొనసాగింది.



ఇక కాంగ్రెస్ నేత మాజీ సీఎం ఓ ఇబోబీ.. పోలింగ్ స్టార్ట్ అయిన వెంటనే ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన చెప్పారు. ఒకట్రెండు సీట్లు తగ్గినా కాని ఇతర పార్టీలతో జట్టుకట్టేందుకు తాము రెడీగా ఉన్నట్లు స్పష్టం చేశారు.ఇక రెండో విడత పోలింగ్లో మొత్తం 92 మంది అభ్యర్థులు బరిలో నిలవడం జరిగింది. ఇక 1247 పోలింగ్ స్టేషన్లను కేంద్ర ఎన్నికల సంఘం రెడీ చేసింది. అలాగే ఈ నియోజకవర్గాల్లో 8.38 లక్షల మంది అర్హులైన ఓటర్లు ఉన్నారు. ఫిబ్రవరి 28 వ తేదీన రాష్ట్రంలో తొలి దశ పోలింగ్ పూర్తైంది. పలు అవాంఛనీయ ఘటనలు హింస మధ్య ఆ ఎన్నికలు అనేవి జరిగాయి. ఇప్పుడు ఏకంగా కాల్పులు మరణాలు నమోదు కావడం అనేది కూడా గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP

సంబంధిత వార్తలు: