యూపీ ఎన్నికలు: బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందా?
ఈ రోజు అవి కాస్తా ఎక్కువయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి ఎన్నికలు కూడా జరుగుతుండడంతో అధిక ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రోజు ఎన్నికల బరిలో మొత్తం 613 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ ఏడవ దశ ఎన్నికలో మొత్తం 2 కోట్ల 600 మంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకోవలసి ఉండగా చివరికి ఎందరు తమ ఓటును వేస్తారో తెలియాల్సి ఉంది. మరి ఈ ఎన్నిక ఏ పార్టీకి అనుకూలంగా జరుగుతుంది. ఓటర్లను ఎవరి పక్షాన ఉన్నారో తెలియాలంటే ఈ నెల 10 వర్కౌ ఆగాల్సిందే. మార్చి 10 వ తేదీన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ఎన్నికల సంఘం ప్రకటించింది.
మరి ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ తమ స్థానాన్ని నిలబెట్టుకుంటుందా? లేదా మరో పార్టీకి అధికారాన్ని కోల్పోతుందా అన్న విషయాలపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. ఇప్పటికే దీని గురించి మోదీ ఉత్తరప్రదేశ్ నాయకులతో కలిసి మాట్లాడినట్లు తెలిసిందే. అయితే ముఖ్యమంత్రిగా ఉన్న యోగి ఆదిత్యానాధ్ మళ్ళీ సీఎం అవుతాడా? లేదా అన్న పలు అంశాలను ప్రజల్లో ఆసక్తిని కలిగిస్తున్నాయి.