కేసీఆర్ ప్రభుత్వం పై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు ?

Veldandi Saikiran
మహిళలు ఒక్కొక్కరు మిసైల్ లాంటి వారు... మహిళలు కోరుకునేది సమాజం లో గౌరవమన్నారు విజయ శాంతి. మహిళ అంటే భాధ్యత... భాధ్యత అంటే మహిళ... సభ్యత, సంస్కారం నేర్పించేది మహిళ... సమాజంలో డ్రగ్స్ కి బానిసై యువత ... తల్లి, చెల్లి అనే భేదం లేకుండా మానభంగాలు పాల్పడుతున్నారని చెప్పారు విజయశాంతి.  డ్రగ్స్ కల్చర్ వచ్చింది తెరాస ప్రభుత్వం వల్లనే.. మద్యం సేవించి బానిసై అడబిడ్డలని , హత్యలు, మానభంగాలు చేస్తున్నారు... ఈలాంటి  ముఖ్యమంత్రి కావాలా అడుగుతున్నానని చెప్పారు విజయశాంతి.  లవ్ జిహాద్ కొత్తగా వచ్చింది... రాష్ట్రంలో సెక్యూరిటీ లేక బిక్కు బిక్కు మని జీవిస్తున్నారు మహిళలన్నారు విజయశాంతి.  ఈ ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేదు... యూపీ లో భద్రత లేని చోట మోడీ గారు, యోగి గారు భద్రత కల్పించారు... ఇప్పుడు మాఫియా చేతుల్లో లేదు ఉత్తప్రదేశ్ అన్నారు విజయశాంతి... యోగి ప్రభుత్వం చేతుల్లో లేదు... యూపీ లో రెండో సారి గెలిచింది అంటే మంచి పనులు చేయడం వల్లనే అని పేర్కొన్నారు విజయ శాంతి.


  అపవిత్రంగా వున్న రాష్ట్రాన్ని కడిగి పవిత్రం చేసిన యోగి ప్రభుత్వం... ఈ రాష్ట్రంలో అలాంటి ప్రభుత్వం లేదు అని ఫైర్ అయ్యారు విజయశాంతి. కాంగ్రెస్ పని అయిపోయింది... ఏ పార్టీ ఇప్పుడు చేసే పనిలో లేదన్నారు విజయశాంతి.  తప్పులు చేసిన ప్రభుత్వం పాతాళం లోకి పోతుంది... ఉద్యోగాలు ఇస్తానని  దొంగ మాటలు చెబుతున్నాడు కెసిఆర్ అన్నారు విజయశాంతి. నాలుగు రాష్ట్రాలు గెలిచాయనే భయంతో ఆసుపత్రిలో పడుకున్నాడు కెసిఆర్... ముందు ప్రజలు మారాలన్నారు విజయశాంతి.  గత ఐదుఏళ్ళలో ఇస్తానన్న పతకాలు ఏమిచేయాలేదు...  కాబట్టి ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరం లేదు... రెండు వేలు, మూడు వేలు ఇచ్చి  మాయ చేస్తున్నాడని నిలదీశారు విజయశాంతి.  ఈ రాష్ట్రం బాగు పడాలంటే మీ చేతుల్లోనే వుంది... మీకు చెప్పడం మా డ్యూటీ... ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం మీ డ్యూటీ...  రాష్ట్రంలో మార్పు అవసరం అన్నారు విజయశాంతి. మీరు బాగుండాలి తప్ప... ఇందులో నా స్వార్థం లేదు... ఆ నాలుగు రాష్ట్రాల్లో మహిళలు, యువత ఓట్లతో గెలుపు అన్నారు విజయశాంతి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: