ఇక బంగ్లాదేశ్లో రాధాకాంత మందిరాన్ని 200 మందికిపైగా దుండగులు ధ్వంసం చేయడం జరిగింది. ఆ దేశ రాజధాని ఢాకాలో ఉన్న ఇస్కాన్ రాధాకాంత మందిరం ధ్వంసమైనట్లు సమాచారం తెలిసింది.ఇక ఉద్దేశపూర్వకంగానే దాదాపు 200 మందికి పైగా దుండగులు ఢాకాలోని 222 లాల్ మోహన్ సాహా వీధిలో ఉన్న ఇస్కాన్ రాధాకాంత మందిరంపై దాడి చేయడం జరిగింది. మందిరాన్ని పూర్తిగా ధ్వంసం చేసి లూటీ చేసినట్లు సమాచారం తెలుస్తోంది. గురువారం నాడు ఈ ఘటన జరిగింది.ఈ దాడిలో సుమంత్ర చంద్ర శ్రావణ్ ఇంకా అలాగే నిహార్ హల్దర్ మరియు రాజీవీ భద్ర సహా పలువురికి గాయాలయ్యాయి.ఈ దాడి హజీ షఫియుల్లా నేతృత్వంలో జరిగినట్లు సమాచారం తెలిసింది.గత సంవత్సరం దసరా వేడుకల వేళ బంగ్లాదేశ్లోని పలు ప్రాంతాల్లో హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారు గుర్తు తెలియని ఛాందసవాదులు. ఆ టైం లో చెలరేగిన అల్లర్లలో నలుగురు చనిపోయారు.
అలాగే అనేక మంది గాయపడ్డారు.హింసను అరికట్టేందుకు అప్పుడు 22 జిల్లాల్లో పారామిలటరీ దళాలను కూడా మోహరించింది ఆ దేశ ప్రభుత్వం.అయితే ఇక ఆ తర్వాత వాటికి వ్యతిరేకంగా మైనారిటీ వర్గానికి చెందిన పలువురు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే అల్లరి మూకలు హిందువుల ఇళ్లపై దాడులకు పాల్పడటం జరిగింది. ఇక ఈ ఘటనల్లో మొత్తం 66 ఇళ్లను ధ్వంసం చేశారు. అలాగే సుమారు 20 ఇళ్లకు నిప్పు పెట్టారు.ఇక హిందూ దేవాలయాలపై ఇంకా అలాగే హిందువల ఇళ్లపై దాడులు చేయండపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్లో హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించాలని భారత విదేశాంగ శాఖ ఆ దేశాన్ని వేడుకుంది. ఇక దీనిపై సానుకూలంగా స్పందించిన ఆ దేశ ప్రధాని షేక్ హసీనా.. ఆ దాడులపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. అయితే తాజాగా మరోసారి హిందువుల మందిరంపై ఈ దాడి జరిగింది. మరి ఇక ఈసారి బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.