ఆంధ్రజ్యోతిపై పరువు నష్టం దావా!
ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో పాటు కేసులో ప్రతివాదులుగా ఉన్న నలుగురు న్యాయ కార్య పద్ధతి పాటించకుండా గత సంవత్సరం డిసెంబర్ 29 వ తేదీన రిటర్న్ స్టేట్మెంట్ను కోర్టులో దాఖలు చేశారని ఇంకా ఆ స్టేట్మెంట్ను పరిగణలోకి తీసుకోవద్దంటూ గత వాయిదా అప్పుడు ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఇక కొన్ని కారణాలతో కోర్టు ఆ పిటిషన్ రిటర్న్ చేయగా సోమవారం నాడు ఎంపీ సుబ్రమణ్యస్వామి ఆ పిటిషన్ను తీసుకుని ఆంధ్రజ్యోతి తరఫు న్యాయవాదికి నోటీసు ఇచ్చి తిరిగి జడ్జికి ఆ పిటిషన్ ఇచ్చారు.ఇంకా అలాగే ఎంపీ సుబ్రమణ్యస్వామి టీటీడీ తరఫున వాదించడానికి అడ్వొకేట్ యాక్ట్ సెక్షన్ 32 కింద ప్రత్యేక అనుమతితో వాదిస్తున్నారని ఇంకా ఆ అనుమతిని రద్దు చేయాలని ఆంధ్రజ్యోతి తరఫు న్యాయవాది క్రాంతిచైతన్య కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఇరువురి పిటిషన్లపై కౌంటర్లు దాఖలు చేయడానికి జడ్జి కేసును జూన్ 21 వ తేదీకి వాయిదా వేశారు.
ఇక టీటీడీ తరఫున కోర్టులో పరువు నష్టం కేసును వాదించే న్యాయ అవగాహన తనకుందని ఎంపీ సుబ్రమణ్యస్వామి చెప్పారు. కేసు వాయిదా తరువాత ఎంపీ మీడియాతో మాట్లాడారు. అసత్య ప్రచారంపై ఇంతకుముందే రాష్ట్ర హైకోర్టులో తాము విజయం సాధించామన్నారు. ఇక వచ్చే వాయిదాకు ఆంధ్రజ్యోతి వేసిన పిటిషన్పై తాము బదులు ఇస్తామని అన్నారు.కాగా, సోమవారం నాడు ఉదయం పూట వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో తిరుమల శ్రీవారి మూలమూర్తిని ఎంపీ సుబ్రమణ్యస్వామి దర్శించుకున్నారు. ఆ తరువాత ఆలయం బయట మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుమల మరింత అభివృద్ధి చెందిందన్నారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హిందూ ఆలయాల్లో క్రైస్తవాన్ని వ్యాప్తి చేస్తున్నారనేది అసత్యమన్నారు. ఇక ఈ విషయాన్ని తాను స్వయంగా పరిశీలించానని ఆయన చెప్పారు.