కరోనా రూల్స్ పై కేంద్రం కీలక ఉత్తర్వులు!

Purushottham Vinay
కరోనా వైరస్ మహమ్మారి రెండు సంవత్సరాల పాటు విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రపంచం మొత్తాన్ని కూడా ఈ వైరస్ అల్లకల్లోలం చేసిందనే చెప్పాలి. ఇక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక భారతదేశంలో కూడా ఈ వైరస్ అనేక మందిని పొట్టన పెట్టుకుంది.ఇక దేశవ్యాప్తంగా కూడా కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి రావడంతో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది.కరోనా వైరస్ మహమ్మారి కట్టడికి ప్రభుత్వం విధించిన నిబంధనలు ఈ నెల 31 వ తేదీ నుంచి ఎత్తివేసేందుకు రెడీ అయినట్లు బుధవారం నాడు కేంద్రం ప్రకటించింది.కానీ, మాస్కు ధరించడం ఇంకా అలాగే ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం వంటివి మాత్రం పాటించాలని కేంద్రం సూచించింది. ఇక ఈ సందర్భంగా హోంశాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాలు ఇంకా అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలకు దీని గురించి సమాచారాన్ని అందించారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత రెండేళ్ల నుంచి దేశంలోని ప్రజలు కేంద్రం విధించిన నిబంధనల మధ్య జీవనం సాగిస్తున్నారు. 



కరోనా వైరస్ మహమ్మారి మొదటి కేసు నుంచి అప్రమత్తంగా ఉన్న కేంద్ర ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు విపత్తు నిర్వహణ చట్టం కింద మార్చి 24, 2020న మొదటిసారిగా దేశంలో కొవిడ్ నిబంధనలను తీసుకొచ్చారు. ఇక ఈ క్రమంలో కరోనా వైరస్ కేసుల పెరుగుదలను బట్టి కొన్ని మార్పులు చేసిన కేంద్రం.. గత కొన్ని వారాలుగా కరోనా వైరస్ అదుపులోనే ఉండటంతో నిబంధనలు పూర్తిగా తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా తెలిపడం జరిగింది. ఇక అంతేగాకుండా, కరోనా వైరస్ తీవ్రతను అంచనా వేయలేం కనుక ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి మాస్కును ధరించడం ఇంకా అలాగే భౌతిక దూరం కూడా ఖచ్చితంగా పాటించడం వంటివి పాటించాలని సూచించారు. అయితే, రాష్ట్రాలలో కరోనా వైరస్ కేసులు కనుక ఎక్కువ పెరిగితే, ఆయా ప్రభుత్వాలు నిబంధనలు విధించుకోవచ్చని పేర్కొనడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: