గర్జించిన ఇండియన్ ఆర్మీ.. వాడు చనిపోయాడు?
గత కొన్ని నెలల నుంచి వరుసగా ఆపరేషన్లు నిర్వహిస్తున్న భారత ఆర్మీ ఉగ్రవాదుల స్థావరాలను గుర్తించి ఎక్కడికక్కడ మట్టు పెడుతుంది. ఇటీవలే మరోసారి భారీ ఎన్కౌంటర్ చేసింది భారత ఆర్మీ. బారాముల్లా జిల్లాలోని ఓ గ్రామంలో ఉదయం ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్ కమాండర్ ఇద్దరు ఉగ్రవాదులను భారత సైన్యం హతమార్చింది అని తెలుస్తుంది. అయితే ఉగ్రవాదులు ఉన్నారు అనే సమాచారం మేరకు తెల్లవారుజాము నుంచే కాశ్మీర్ పోలీసులతో కలిసి సరిహద్దు భద్రతా బలగాలు భారముల్లా జిల్లాలోని మాల్వా ఏరియాలో గాలింపు చర్యలు చేపట్టాయి.
ఈ క్రమంలోనే సైన్యాన్ని గుర్తించిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన భారత బలగాలు ఎదురు కాల్పులు జరపడం గమనార్హం ఇక ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారని ఒక ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్ కమాండర్ ను కూడా మట్టి పెట్టినట్లు జమ్మూకాశ్మీర్ పోలీసులు సోషల్ మీడియాలో వెల్లడించారు. సంఘటన స్థలంలో ఆయుధాలు మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు అని చెప్పుకొచ్చారు. హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నామని ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారు అంటూ వెల్లడించింది.