భారీగా పెరగనున్న ఆయిల్ ధరలు... సామాన్యులకు ఇక్కట్లు తప్పవా?
కాగా దీని ముఖ్య ఉద్దేశం ఇంట్లోని ఆహార ఉత్పత్తుల లభ్యతను నిర్ధారించడమే ప్రధాన లక్ష్యం అని జోకో విడోడో అన్నారు. అలాగే దేశీయ విపణిలో వంటనూనెలు సమృద్ధిగా , అంతే కాకుండా అందరికి అందుబాటు ధరలో ఉండేలా చూస్తాం అని కూడా స్పష్టం చేశారు. ఇక దాని కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా పేర్కొన్నారు. ఇక ఆదేశం పామాయిల్ యొక్క ఎగుమతులను నిలిపివేయడం వలన.. దాని ప్రభావం మన దేశం పైన కూడా తీవ్రంగా పడుతుంది. ఎందుకుంటే మన దేశమే పెద్ద మొత్తంలో ఇండోనేసియా నుండి ఆయిల్ను దిగుమతి చేస్తుంది. కాగా ఏప్రిల్ 28 నుంచి భారత్కు ఆ నూనె రాదు. ఇక అప్పుడు పామాయిల్ కొరత ఏర్పడటంతో .. దాని ధరలు కూడా భారీగా పెరిగే అవకాశము లేకపోలేదు. .
ఇక వంట నూనెల విషయానికి వచ్చినట్లైతే మనదేశం ఎక్కువగా దిగుమతుల పైనే ఆధారపడి ఉంటుంది. అంతే కాదు ప్రతి ఏటా 13 నుండి 13.5 మిలియన్ టన్నుల నూనెను మన దేశం దిగుమతి చేసుకుంటుంది. అయితే ఇందులో 8 నుండి 8.5 మిలియన్ టన్నులు పామాయిలే అవ్వటం మరీ విశేషం. అంటే మనం 63శాతం పామాయిల్ను దిగుమతి చేసుకుంటున్నాం. అయితే మనం ఏటా దిగుమతి చేసుకునే 8 నుండి 8.5 మిలియన్ టన్నుల పామాయిల్ లో 45శాతం ఒక్క ఇండోనేసియా నుంచే దిగుమతి అవుతుంది. మిగిలిన భాగం మలేషియా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అయితే ఇక ఇప్పుడు ఇండోనేసియా తన ఎగుమతులపై నిషేధం విధించుకుంది.
మరి పక్కనే ఉన్న మలేషియాలో కూడా ఉత్పత్తి బాగా తగ్గిపోయింది. అయితే ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం వల్ల మనదేశంలో వంటనూనె ధరలు ఎంతగా పెరిగిపోయాయి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు ఇండోనేసియా, మలేసియా నుండి కూడా దిగుమతులు రాకపోతే .. మరి ఆ ప్రభావం ఇంకెంతగా వేదిస్తుందో చూడాలి. దీనితో వంటనూనె ధరలు రానున్నరోజుల్లో ఎలా ఉంటాయి అనేది ఊహకే అందని పెద్ద సమస్యగా ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.