ఆదాయం పొందాలని అనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధ కేంద్రాలను మరింత విస్తరించాలని కేంద్రం అనుకుంటోంది.ఇక జన ఔషధి కేంద్రాన్ని కనుక ఏర్పాటు చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాల లోకి వెళితే.. దేశవ్యాప్తంగా కూడా 26 రాష్ట్రాల్లో 406 జిల్లాల్లో 3579 బ్లాక్స్లో జన్ ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్రం ప్లాన్ చేస్తుంది. అలాగే దీని కోసం ఆన్లైన్ అప్లికేషన్స్ను కేంద్రం ఆహ్వానిస్తోంది.భారత ప్రభుత్వం 2024 వ సంవత్సరం మార్చి నాటికి జన ఔషధి కేంద్రాల సంఖ్యను 10 వేలకు చేరాలని అనుకున్న సంగతి తెలిసిందే. ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా కి జన ఔషధి కేంద్రాల బాధ్యతను అప్పగించడం జరిగింది. ఇక ఈ ఏజెన్సీ ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. జన ఔషధి వెబ్సైట్కు వెళ్లి ఆన్లైన్లోనే అప్లికేషన్ పూర్తి చేసిన తరువాత సబ్మిట్ చెయ్యాల్సి వుంది.
అర్హత ఉంటే డ్రగ్ లైసెన్స్ ని కూడా జారీ చేస్తుంది. వ్యక్తులు, నిరుద్యోగ ఫార్మసిస్ట్స్, గవర్నమెంట్ నామినేటెడ్ ఇన్స్టిట్యూషన్స్, ఎన్జీవోలు, ట్రస్ట్లు ఇంకా అలాగే సోసైటీలు కూడా ఈ వీటి కోసం అప్లై చేసుకోచ్చు. నాణ్యమైన ఔషధాలను అందుబాటు ధరలోనే ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ఈ జన్ ఔషధి కేంద్రం ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సోషల్ మీడియా వేదికగా జన్ ఔషధి కేంద్రాల ఏర్పాటు విషయాన్ని పీఐబీ ఇండియా చెప్పింది.మహిళలు, ఎస్సీ, ఎస్టీ ఇంకా అలాగే కొండ ప్రాంతాల్లోని జిల్లాలు వారికి రాయితీలు అనేవి లభిస్తాయి.ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలను జన్ ఔషధి వెబ్సైట్లో మనం చూసి తెలుసుకోవచ్చు. జన్ ఔషధి కేంద్రాలలో 1616 రకాల ఔషధాలు అనేవి లభిస్తాయి. ఇంకా అలాగే 250 సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా. ఆయుష్ కిట్స్ ఇంకా బాలరక్ష కిట్స్ ఇంకా అలాగే ఆయుష్ 64 ట్యాబ్లెట్స్ వంటివి కూడా ఉంటాయి.