ఇక శాంతిభద్రతల పరిరక్షణలోనే కాదు మానవత్వానికి ప్రతీకగా కూడా చాంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ కె.ఎన్.ప్రసాద్వర్మ నిలిచారు.ప్రాణాపాయ స్థితిలో ఉన్న 6 నెలల చిన్నారికి ప్రైవేటు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్సని చేయించి ఆ తరువాత నిలోఫర్ ఆసుపత్రికి స్వయంగా పోలీస్ కారులో తీసుకెళ్లి చేర్పించారు. ప్రాణాపాయ స్థితి నుంచి ఆ పాప బయటపడడంతో తల్లిదండ్రులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని లాతూర్, బండగేడ్కు చెందిన సొహెల్ ఇంకా అలాగే నెహా దంపతులు పాతబస్తీ బండ్లగూడలో ఉంటున్నారు.వీరి 6 నెలల కూతురు నేవికి తీవ్ర జ్వరంతో శ్వాస అందక ఫిట్స్ అనేవి వచ్చాయి.ఆందోళనతో ఆ చిన్నారిని తీసుకొని ఆ దంపతులు ఇద్దరూ బండ్లగూడలోని చాంద్రాయణగుట్ట ఠాణా ముందు నుంచి హడావుడిగా వెళ్తుతున్నారు. ఇక అదే సమయంలో స్టేషన్ నుంచి బయటకు వస్తున్న చాంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ అయిన కె.ఎన్.ప్రసాద్వర్మ ఆ దంపతులను గమనించారు. ఏం జరిగిందని వారిని అడగగా పాప పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, చికిత్స చేయించడానికి డబ్బులు కూడా లేవని బోరున విలపించారు.
వెంటనే ఆయన వారిని తన కారులో సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు.పాప పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని వెంటనే నిలోఫర్కు తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించడంతో సీఐ ప్రసాద్వర్మ.. ఇక తన కారులో స్వయంగా నిలోఫర్కు తీసుకెళ్లారు. దారి మధ్యలోనే తనకు పరిచయం ఉన్న నాంపల్లి పోలీసులకు కూడా సమాచారం ఇచ్చి నిలోఫర్ ఆసుపత్రిలో పాప చేరికకు ఏర్పాట్లని చేయించారు. చివరికి పాప ప్రాణాపాయం నుంచి బయటపడిందని అక్కడి వైద్యులు చెప్పడంతో వారంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఆ దంపతులకు ఆ ఇన్స్పెక్టర్ ఆర్థికసాయం కూడా అందజేశారు.ఇలా తనకు తెలియని వారి పసికందుకు సహాయం చేసి ఈ పోలీస్ దేవుడయ్యారు. దైవం మానుష్య రూపేనా అని ఈయన మరోసారి నిరూపించారు. సోషల్ మీడియా వ్యాప్తంగా నెటిజనులు ఈ పోలీస్ కి జేజేలు పలుకుతున్నారు.ఇలాంటి పోలీసులే సమాజానికి కావాలంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రియల్లీ గ్రేట్ కదూ!