అమర్నాథ్యాత్ర పై ఉగ్రకుట్ర.. బయటపెట్టి బీఎస్ఎఫ్?
జమ్ముూ కాశ్మీర్లోని పాకిస్థాన్ ఔట్పోస్టుకు సమీపంలో ఉన్న ఈ సొరంగం గుర్తించారు. దీని ద్వారా ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు ఏర్పాటు చేశారని సైన్యం భావిస్తోంది. సాంబా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఈ భారీ సొరంగాన్ని సరిహద్దు భద్రతా దళం కనిపెట్టింది. చాక్ ఫఖీరా బోర్డర్ ఔట్పోస్టుకు సమీపంలో 150 మీటర్ల సొరంగం ఉంది. ఈఏడాది జూన్ 30 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ యాత్ర లక్ష్యంగా ఈ సొరంగం తవ్వారని భావిస్తున్నారు.
పాక్ భూభాగం నుంచే ఈ సొరంగం ఉందని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. పాక్ అవుట్ పోస్ట్కు కేవలం 3వందల మీటర్ల దూరంలోనే ఈ సొరంగం ఉండటం విశేషం. ఈ సొరంగం నుంచి భారత్లోని చివరి గ్రామానికి దూరం కేవలం 700 మీటర్లు మాత్రమే. అమర్నాథ్ యాత్రపై దాడి చేసేందుకే ఉగ్రవాదులు ఈ సొరంగం నుంచి చొరబాటుకు ప్లాన్ చేసుకుని ఉంటారని సైన్యం భావిస్తోంది.
అమర్నాథ్ యాత్రపై దాడులు చేయడం పాక్ ఉగ్రవాదులకు కొత్త కాదు.. 2017లో అమర్నాథ్ యాత్రికుల బస్సుపై లష్కరే తోయిబా ఉగ్రవాదులు జరిపిన దాడిలో 8 మంది ప్రాణాలు చనిపోయారు. ఇటీవల కూడా జమ్మూ కాశ్మీర్లో దాడులు జరిగాయి. సుంజ్వాన్ ప్రాంతంలో ఏప్రిల్ 22న సీఐఎస్ఎఫ్ బస్సుపై ఇద్దరు ఉగ్రవాదులు దాడి చేశారు. మొత్తానికి ఉగ్రవాదుల కుట్ర బట్టబయలు కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.