ఇక ఓ అమ్మాయి చేతిలో నుంచి సెల్ఫోన్ పొరపాటున జారి పడి పగిలిపోయింది.తన తండ్రి తిడతాడన్న భయంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. పాపం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ విషాద సంఘటన కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చిన జగ్గంపేటలో మంగళవారం నాడు చోటు చేసుకుంది.ఇక గ్రామానికి చెందిన సారిపల్లి నాగన్నది చాలా నిరుపేద కుటుంబం. ఆయనకి భార్య ఇంకా ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. చాలా కష్టపడి కూలిపని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బాగా కష్టపడి పెద్ద కుమార్తెకు వివాహం చేశాడు. ఇక రెండో కుమార్తె సత్యవేణి (16) ఆరో తరగతి వరకూ చదివి మానేసింది. ఆమె స్నేహితులందరూ కూడా ఎప్పటి నుంచో సెల్ఫోన్ వాడుతున్నారు. తనకూ ఫోన్ కొనిపెట్టమని తండ్రిని తరచుగా అడిగేది. అయితే అంత స్థోమత లేదంటూ కుమార్తెకు నాగన్న ఎప్పుడూ కూడా నచ్చజెబుతూండేవాడు.ఇక కుమార్తె కోరిక తీర్చేందుకు అప్పు చేసి, 11వ తేదీన కొత్త సెల్ఫోన్ ని కొని ఇచ్చాడు.
అదే రోజు తన చెల్లెలితో కలిసి ఆ ఫోనుతో సత్యవేణి ఆడుకుంటూండగా, ఒక్కసారిగా ఆ ఫోన్ కింద పడి పగిలిపోయింది.ఈ విషయం తెలిస్తే తండ్రి తిడతాడని సత్యవేణి చాలా భయపడింది. పొలానికి కొట్టడానికని నాగన్న గడ్డి మందు కొని తెచ్చి వారి బాత్రూములో పెట్టాడు.ఇక సత్యవేణి ఆ మందు తాగి ఎవరికీ చెప్పకుండా అలాగే పడుకుని ఉండిపోయింది.ఇక కొంతసేపటికి వాంతులు కావడంతో ఏమైందని అడగ్గా తాను గడ్డి మందు తాగినట్టు చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను కాకినాడలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అలాగే అక్కడి నుంచి కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటి నుంచీ అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం నాడు ఆమె మృతి చెందింది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కూడా ఆత్మ హత్యలు చేసుకోండి. తల్లిదండ్రులు కూడా పిల్లలు చేసే చిన్న చిన్న పొరపాట్లకి మందలించి వారిలో భయాన్ని నింపకండి.