చాలా తక్కువ ఖర్చులో ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు, అలాగే ఇంధన వినియోగం తగ్గడంతో కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చు. ఇవన్నీ కూడా విద్యుత్ ఆధారిత వాహనాలతో కలిగే లాభాలు.అందుకే ప్రభుత్వాలు సైతం ఈ ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి పెద్ద పీట వేస్తూ వచ్చాయి, ఇంకా సబ్సిడీలు అందిస్తున్నాయి. అయితే పలు సంఘటనలు చూస్తుంటే ఎలక్ట్రిక్ బైక్స్ ఎంత వరకు సురక్షితమన్న ప్రశ్నలు చాలా తలెత్తుతున్నాయి. ఇటీవల పేలుతోన్న బైక్స్ జనాలను భయంతో హడలెత్తిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్లో రెండు పేలాయి.ఇక హైదరాబాద్లో ఒకే రోజు రెండు ఎలక్ట్రిక్ బైక్స్ పేలడం స్థానికంగా కలకలం రేపింది.పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ కుషాయిగూడలోని సాయినగర్లో సోమవారం నాడు ఛార్జింగ్ పెట్టిన రెండు బైక్స్ ఒక్కసారిగా పేలిపోయాయి.ఇక ఈ పేలుడు ధాటికి రెండు బైక్స్ కూడా తుక్కుతుక్కైపోయాయి. కనీసం బండి ఆనవాలు కూడా కనిపించకుండా అవి పూర్తిగా ధగ్దమయ్యాయి. ఇక
{{RelevantDataTitle}}