సంచలన నిర్ణయం తీసుకున్న ఇండియన్ ఎయిర్ఫోర్స్?
INDIAN air FORCE HAS TAKEN SENSATIONAL DECISION..
ఇండియన్ ఎయిర్ఫోర్స్ సెన్సేషనల్ డెసిషన్ తీసుకుంది.మిగ్-21 యుద్ధ విమానాలు వాడకూడదని నిర్ణయం తీసుకుంది.ఎందుకంటే తరచూ ప్రమాదాలకు గురికావడంతో ఈ నిర్ణయం తీసుకుంది.అయితే భారత వైమానిక దళం (IAF) చెకింగులు నిర్వహించబడే దాకా MiG-21 యుద్ధ విమానాల మొత్తం విమానాలను నిలిపివేసింది. ఈ నెల ప్రారంభంలో రాజస్థాన్ మీదుగా వెళ్లే యుద్ధ విమానం క్రాష్ వెనుక కారణాలపై పరిశోధనలు కూడా జరిగాయి.మే 8 వ తేదీన సూరత్గఢ్ ఎయిర్ బేస్ నుంచి మిగ్-21 బైసన్ ఎయిర్క్రాఫ్ట్ విమానం హనుమాన్గఢ్ మీదుగా ఒక గ్రామంలో కూలిపోవడం జరిగింది. ఇంకా ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అయితే పూర్తి విచారణ నిర్వహించి కూలిపోవడానికి గల కారణాలను నిర్ధారించనున్నట్లు సీనియర్ రక్షణ అధికారులు తెలిపడం జరిగింది. మిగ్-21 బైసన్ విమానం ప్రమాద ఘటనపై దర్యాప్తు పూర్తయి ప్రమాదానికి గల కారణాలు తెలిసే దాకా ఈ మిగ్-21 విమానాలను నిలిపివేసినట్లు రక్షణ శాఖ సీనియర్ అధికారులు తెలిపారు.
ఈ MiG-21 ఎయిర్క్రాఫ్ట్ వేరియంట్లు మొత్తం ఐదు దశాబ్దాలుగా భారత వైమానిక దళంలోకి ప్రవేశించడం ప్రారంభించాయి. దశలవారీగా తొలగింపు అనేది జరుగుతోంది. ఇక ఐఏఎఫ్లో కేవలం మూడు మిగ్-21 స్క్వాడ్రన్లు మాత్రమే పనిచేస్తున్నాయని, వాటన్నింటినీ 2025 వ సంవత్సరం ప్రారంభంలో దశలవారీగా తొలగించబోతున్నామని అధికారులు తెలిపారు. రాజస్థాన్పై కూలిపోయిన యుద్ధ విమానం సాధారణ శిక్షణలో ఉండగా ప్రమాదానికి గురవ్వడం జరిగింది. ఇక అందులో భాగంగా పైలట్కు స్వల్ప గాయాలయ్యాయి. ఆ తర్వాత ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి విచారణని వేగవంతం చేశారు.ఈ IAFలో మూడు మిగ్-21 బైసన్ వేరియంట్తో సహా 31 యుద్ధ విమాన స్క్వాడ్రన్లు ఉన్నాయి. ఇక మిగ్-21 1960లలో ఇండియన్ ఎర్ఫోర్స్లోకి చేర్చబడింది.ఇంకా అలాగే 800 రకాల యుద్ధవిమానాలు సేవలో ఉన్నాయి.