మంత్రిగా చేయకుండానే.. డైరెక్ట్ సీఎం అయ్యింది వీళ్లే?

praveen
తెలంగాణలో ఎన్నికల హడావిడి ముగిసింది. ఎవరు ఊహించని విధంగా అధికారంలో ఉన్న టిఆర్ఎస్ను గద్దరించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏకంగా 64 స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటింది కాంగ్రెస్ పార్టీ. ఇక 39 స్థానాలలో విజయం సాధించిన అధికార టీఆర్ఎస్ పార్టీ ఇక ఇప్పుడు ప్రతిపక్ష హోదాతో సరిపెట్టుకునే పరిస్థితి వచ్చింది అని చెప్పాలి. అయితే కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారో అనే విషయంపై అందరిలో ఉత్కంఠ ఉంది.


 అయితే ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి ఇక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని అందరూ భావించారు. అయితే ఇక ఈ ముఖ్యమంత్రి సీటు పంచాయితీ ఢిల్లీ వరకు వెళ్లగా.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఢిల్లీ పెద్దలు కూడా రేవంత్ రెడ్డికే సీఎం పీఠాన్ని అప్పగించారు. ఇక మిగతా మంత్రుల నుంచి అసంతృప్తి రాకుండా సర్ది చెప్పారు అని చెప్పాలి. అయితే ఇటీవల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా జరిగిపోయింది. ఇక మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా ఇదే కార్యక్రమంలో జరిగింది అని చెప్పాలి.


 రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో ఒక ఆసక్తికర విషయం వైరల్ గా మారిపోయింది. ఇప్పటివరకు ఒక్కసారి కూడా మంత్రి పదవి చేపట్టకుండానే డైరెక్ట్ గా సీఎం అయిన పొలిటీషియన్ గా రేవంత్ రెడ్డి రికార్డ్ సృష్టించారు. గతంలో ఇలా ఎవరు మంత్రిగా పనిచేయకముందే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎన్టీఆర్, కిరణ్ కుమార్ రెడ్డి, వైయస్ జగన్ లు గతంలో మంత్రులుగా పని చేయకుండానే డైరెక్ట్గా సీఎం అయిపోయారు. అయితే వీరిలో కనీసం గతంలో ఎమ్మెల్యేగా కూడా పనిచేయకుండా మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడే ముఖ్య మంత్రి పీఠాన్ని అధిరోహించింది మాత్రం ఎన్టీఆర్ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: