పార్లమెంట్,
అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ
ఏపీ రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. ప్రధాన పార్టీలు ఇప్పటికే సభలు, సమావేశాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.పోటాపోటీగా ర్యాలీలు నిర్వహిస్తూ ఎన్నికల రేసులో దూసుకుపోతున్నాయి. అయితే
ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు
షర్మిల చేపట్టిన తర్వాత రాజకీయాలు చాలా ఆసక్తిగా మారాయి.
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని పెంచే ప్రయత్నంలో భాగంగా ఆమె గత వారం
తెలంగాణ సీఎం
రేవంత్ రెడ్డిని కలిసి సమకాలీన రాజకీయ అంశాలపై చర్చించారు. అయితే
షర్మిల ఢిల్లీ వెళ్లి
సోనియా గాంధీని కలిసిన తర్వాత ఈ భేటీ జరిగింది.తాజాగా తెలుస్తున్న ప్రకారం.. ఎన్నికల ప్రచారంకి
తెలంగాణ నాయకుడు
రేవంత్ రెడ్డిని ఏపీకి తీసుకురావాలని
షర్మిల తన ప్రతిపాదనను
సోనియా గాంధీకి అందించారు. ఈ ప్లాన్కు
సోనియా గాంధీ కూడా ఆమోదం తెలిపారని, దానిని
షర్మిల స్వయంగా
రేవంత్ రెడ్డి వద్దకు తీసుకెళ్లారని, ఆయన కూడా సానుకూలంగా స్పందించారని సమాచారం తెలుస్తుంది.
పర్యవసానంగా
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో
రేవంత్ ప్రవేశం ఇంకెంతో దూరంలో లేదు.
షర్మిల ప్రస్తుతం తన కొడుకు రాజారెడ్డి
పెళ్లి పనుల్లో ఎంతో బిజీగా ఉన్నారు. ఆమె
ఫిబ్రవరి 20న
కాంగ్రెస్ పెద్దల సమక్షంలో భారీ బహిరంగ సభ నిర్వహించే ఛాన్స్ ఉంది.ఆంధ్రప్రదేశ్ లో
రేవంత్ రెడ్డి బహిరంగ సభకు తిరిగి వస్తే, అది ఈ నెలాఖరులోగా కార్యరూపం దాల్చవచ్చు.
ఫిబ్రవరి నెలాఖరులో వైజాగ్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు బ్లూప్రింట్ సిద్ధమవుతున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఈ సమావేశంలో
తెలంగాణ సీఎం
రేవంత్ రెడ్డి మాత్రమే కాకుండా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా పాల్గొనే ఛాన్స్ ఉంది. ఈ భారీ ఎన్నికల సభ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని
కాంగ్రెస్ మేనిఫెస్టోను కూడా సమావేశంలో ప్రకటించవచ్చు.కర్ణాటక,
తెలంగాణ రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చిన
కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో పాగా వేయాలని గట్టిగా నిర్ణయించుకుంది. అయితే
రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కు మైలేజ్ తీసుకొచ్చేలా పనిచేయొచ్చు.ఇక
షర్మిల, రేవంత్లను ఒకే వేదికపై చూడటం,
ఏపీ కాంగ్రెస్ కార్యకర్తల్లో నూతన
జోష్ నింపవచ్చు.